తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈసారీ రెపో వడ్డీ రేట్లను తగ్గించనున్న ఆర్బీఐ!

మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరోసారి ఆర్బీఐ రెపో రేటు తగ్గించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2019-20 రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోడవం వంటి కారణాలను పరిగణించి ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

By

Published : Dec 1, 2019, 7:43 PM IST

Updated : Dec 1, 2019, 8:14 PM IST

RBI
ఆర్బీఐ

ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరిన ఆర్థిక వృద్ధిరేటును పెంచడమే లక్ష్యంగా రిజర్వు బ్యాంకు వరుసగా ఆరోసారి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఈనెల 3-5 మధ్య జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్‌, మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత డిసెంబర్‌లో ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరిగిన ప్రతి ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గిస్తూనే ఉన్నారు. 2019లో ఇప్పటి వరకూ 5సార్లు వడ్డీరేట్లను సవరించారు. మొత్తం 135 బేసిస్‌ పాయింట్ల రెపో తగ్గించింది ఆర్బీఐ.

మాంద్యం పరిస్థితులను అధిగమించడం సహా ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.

వృద్ధిరేటు తిరిగి పుంజుకునే వరకూ వడ్డీ రేట్లు తగ్గిస్తూనే ఉంటామని గతంలో ఆర్బీఐ గవర్నర్‌ చెప్పిన విషయాన్ని బ్యాంకర్లు గుర్తుచేస్తున్నారు.

ఇదీ చూడండి:జీఎస్టీ వసూళ్ల వృద్ధి.. నవంబర్​లో మళ్లీ లక్ష కోట్ల ప్లస్

Last Updated : Dec 1, 2019, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details