తెలంగాణ

telangana

ETV Bharat / business

'క్రియాశీల ఆర్థిక వ్యవస్థకు నిష్పాక్షిక ఆడిట్ అవసరం'

ఆడిటింగ్ నిర్వహణపై ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das news) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడిటింగ్ వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. క్రియాశీల ఆర్థిక వ్యవస్థ కోసం ఆడిటింగ్ (Auditing in India) సమర్థంగా చేపట్టడం అవసరమని అభిప్రాయపడ్డారు.

By

Published : Oct 25, 2021, 11:56 AM IST

Updated : Oct 25, 2021, 12:59 PM IST

RBI GOVERNOR
ఆర్​బీఐ ఆడిటింగ్ ప్రమాణాలు

క్రియాశీల, ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ కోసం ఆడిట్ నిర్వహణ (Auditing in India) సమర్థంగా, నిష్పాక్షికంగా చేపట్టడం అవసరమని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das news) పేర్కొన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్​లో ప్రభుత్వ ఆడిటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆడిటింగ్ వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు.

"పబ్లిక్ ఫైనాన్స్ ఆడిటింగ్ నిర్వహించడం చాలా ముఖ్యం. ఈ నివేదికల ఆధారంగానే ప్రభుత్వాలు వ్యయాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. ఆడిట్ నాణ్యత పెరగాల్సిన అవసరం ఉంది. గ్లోబలైజేషన్, ఆర్థిక వ్యవస్థల్లో పెరుగుతున్న ప్రతికూలతల నేపథ్యంలో ఆడిటింగ్ కీలకం కానుంది. ప్రస్తుత పోకడలకు అనుగుణంగా ఆడిటర్లందరూ తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి."

-శక్తికాంత దాస్, ఆర్​బీఐ గవర్నర్

ప్రమాణాలు మెరుగుపర్చేందుకు...

ఆడిటింగ్ ప్రమాణాలను (Auditing Standards in India) మెరుగుపర్చేందుకు సంబంధిత వర్గాలతో ఆర్​బీఐ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని శక్తికాంత దాస్ వివరించారు. బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలలో బలమైన ప్రభుత్వ ఫ్రేమ్​వర్క్ (RBI Audit guidelines) ఉండాలని ఆర్​బీఐ ఎప్పటి నుంచో చెబుతోందని పేర్కొన్నారు. సమర్థమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు ఇది అవసరమని అన్నారు.

మరోవైపు, ఆర్థిక వ్యవహారాలపై తీసుకునే నిర్ణయాలు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే ఉంటాయని తెలిపారు. తప్పుడు సమాచారంతో తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ప్రభావానికి కారణమవుతాయని అన్నారు.

ఇదీ చదవండి:Reliance News: రిలయన్స్‌కు హరిత ఇంధనం- ఐదేళ్లలో భారీగా లాభాలు!

Last Updated : Oct 25, 2021, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details