తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థికవేత్తలతో భేటీ కానున్న ప్రధాని మోదీ

కేంద్ర పూర్తిస్థాయి బడ్జెట్​ తుది కసరత్తును ముమ్మరం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా నేడు ఆర్థిక వేత్తలతో సమావేశం కానున్నారు.

By

Published : Jun 22, 2019, 3:08 PM IST

Updated : Jun 22, 2019, 5:36 PM IST

ఆర్థికవేత్తలతో మోదీ భేటీ

పార్లమెంటులో సార్వత్రిక బడ్జెట్​ను​ ప్రవేశపెట్టేందుకు సమయం సమీపిస్తున్న వేళ..ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆర్థికవేత్తలు, నిపుణులతో నేడు సమావేశం కానున్నారు ప్రధాని. సాయంత్రం 4:30 గంటలకు దిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, అవసరాలపై చర్చించనున్నారు. బడ్జెట్​ రూపకల్పన కోసం సలహాలు స్వీకరించనున్నారు.

వచ్చే నెల 5న లోక్​సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్​ మొదటి సారి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు.

ఇదీ చూడండి: 'చిత్తశుద్ధి లేనందునే మల్టీ లెవల్ మోసాలు'

Last Updated : Jun 22, 2019, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details