తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2020, 5:21 PM IST

ETV Bharat / business

కరోనా ప్యాకేజీపై ఆర్థిక శాఖ సమీక్ష ముఖ్యాంశాలు

కరోనా నేపథ్యంలో ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ అమలుపై ఆర్థిక శాఖ మూడు రోజుల సమగ్ర సమీక్ష ఆదివారం ముగిసింది. అన్ని శాఖలు, విభాగాలు ఇప్పటికే ఈ పథకం ప్రయోజనాలను అందిస్తున్నట్లు సమీక్ష అనంతరం ప్రకటించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ.

Nirmala review on Aatma Nirbhar Bharat
ఆర్మ నిర్భర్ భారత్​పై నిర్మలా సీతారామన్ సమీక్ష

ఆత్మ నిర్భర్ భారత్ పథకం అమలుపై.. వివిధ శాఖల కార్యదర్శులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన మూడు రోజుల సమీక్ష ఆదివారం ముగిసింది. ఆత్మ నిర్భర్ భారత్​లో భాగంగా ప్రకటించిన మూడు పథకాలను ఇప్పటికే సంబంధిత శాఖలు, విభాగాలు అమలు చేస్తున్నట్లు సమీక్ష తర్వాత ఆర్థిక శాఖ తెలిపింది. ఆయా పథకాల అమలు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది.

పథకం అమలు ఇలా..

ఆత్మ నిర్భర్ భారత్​లో భాగమైన అత్యవసర రుణ గ్యారెంటీ పథకం ద్వారా డిసెంబర్ 4 నాటికి.. 80,93,491 ఎంఎస్​ఎంఈలకు రూ.2,05,563 కోట్ల రుణాలను బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు మంజూరు చేసినట్లు తెలిపింది ఆర్థిక శాఖ. అందులో 40,49,489 ఎంఎస్​ఎంఈలకు రూ.1,58,626 కోట్ల రుణాలను ఇప్పటికే అందించినట్లు వివరించింది.

కిసాన్ క్రెడిట్స్​ ద్వారా పీఎం-కిసాన్ లబ్ధిదారులకు రాయితీ క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు ఆర్థిక సేవల విభాగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పన్ను చెల్లింపు దారులకు ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్​ 8 వరకు రూ.1,45,619 కోట్లు రీఫండ్ చేసినట్లు ఆర్థిక శాఖ వివరించింది. 89.29 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఈ మొత్తాన్ని రీఫండ్ చేసినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:బడ్జెట్​ సన్నాహక భేటీలు 14 నుంచి షురూ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details