తెలంగాణ

telangana

ETV Bharat / business

నాన్​ బ్యాంకింగ్​ రంగంలో సంక్షోభం తలెత్తొచ్చు!

దేశంలో నాన్ బ్యాంకింగ్​ రంగాలు మున్ముందు తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి రావచ్చని కార్పొరేట్​ వ్యవహారాల కార్యదర్శి ఇంజెటి శ్రీనివాస్​ తెలిపారు. కొన్ని సంస్థలు చేసిన భారీ తప్పిదాల మూల్యమే ఇందుకు దారితీయొచ్చని ఆయన అన్నారు.

By

Published : May 12, 2019, 11:14 PM IST

నాన్​ బ్యాంకింగ్​ రంగంలో సంక్షోభం తలెత్తొచ్చు!

కొన్ని ప్రధాన సంస్థల సంక్షోభం, రుణ భారం కారణంగా త్వరలో నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ రంగం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.

కార్పొరేట్​ వ్యవహారాల కార్యదర్శి ఇంజెటి శ్రీనివాస్ ఇటీవల ఓ ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని పెద్ద సంస్థలు చేసిన పొరపాట్లు, రుణ భారంలో చిక్కుకున్న మరికొన్ని సంస్థల కారణంగా నాన్​ బ్యాంకింగ్​ రంగాలు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా ఐఎల్​&ఎఫ్​ఎస్ సహా పలు ఇతర సంస్థల సంక్షోభం ఇందుకు కారణమని పేర్కొన్నారాయన. ఆయా సంస్థల ఆస్తులు, అప్పులు దాదాపు సమంగా ఉండటం కూడా ఇందుకు మరింత ఊతమందిస్తున్నట్లు తెలిపారు.

అయితే ఎటువంటి గడ్డుపరిస్థితుల్లోనైనా "బాధ్యతాయుతమైన" కొన్ని కంపెనీలు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దేశంలోని కార్పొరేట్ అధికార యంత్రాంగం వీటిపై దృష్టి సారించినట్లు తెలిపారు.

"ఇది కాపాడుకోవాల్సిన సమయం. మధ్యస్థ, దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తుంది. అయితే.. స్వల్పకాలికంగా సమస్యలు సృష్టించొచ్చు. మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే.. సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చు. దేశంలో చాలా కంపెనీలు దృఢమైన యంత్రాంగాన్ని కలిగి ఉన్నాయి. అవి సంక్షోభాన్ని నియంత్రిస్తాయి. అందుకే ఆయా కంపెనీలు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం రాదు."

- ఇంజెటి శ్రీనివాస్​, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి

ఇదీ చూడండి: అంధుల కోసం ఆర్బీఐ 'కరెన్సీ యాప్​'!

ABOUT THE AUTHOR

...view details