తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2020, 1:56 PM IST

ETV Bharat / business

'వృద్ధి రేటు క్షీణత 10.6 శాతమే!'

కరోనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కాస్త సానుకూల అంచనాలను ప్రకటించింది మూడీస్ ఇన్వెస్టర్స్. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ది రేటు అంచనాను -11.5 శాతం నుంచి -10.6 శాాతానికి తగ్గించింది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'ఆత్మనిర్భర్​ భారత్​ 3.0' ఉద్దీపన నేపథ్యంలో ఈ సవరణ చేసినట్లు వెల్లడించింది.

Moody's on India growth rate
దేశ వృద్ధి రేటుపై మూడీస్ సానుకూల అంచనాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వద్ధి రేటుపై కాస్త సానుకూల అంచనాలను విడుదల చేసింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ 'మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్'. కరోనా కారణంగా 2020-21లో భారత్ వృద్ధి రేటు -11.5 శాతంగా నమోదవుతుందని గతంలో వేసిన అంచనాను తాజాగా.. -10.6 శాతానికి సవరించింది.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు గత వారం కేంద్రం రూ.2.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ తయారీ రంగం, ఉద్యోగ కల్పన, దీర్ఘ కాలిక వృద్ధి వంటి వాటిని ప్రోత్సహిస్తుందని మూడీస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వృద్ధి రేటు అంచనాలను సవరించినట్లు పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత్ వృద్ధి రేటు 10.8 శాతంగా నమోదవుతుందని పేర్కొంది మూడీస్. ఇంతకు ముందు ఈ అంచనా 10.6 శాతంగా ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:'నైతిక విలువలుంటేనే మంచి వ్యాపారం'

ABOUT THE AUTHOR

...view details