తెలంగాణ

telangana

ETV Bharat / business

'2020లో భారత వృద్ధి రేటు 2.5 శాతమే' - coronavirus latest news china

కరోనా వైరస్ వ్యాప్తితో వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో జీడీపీ వృద్ధిరేటు అంచనాలను సవరించింది ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ 'మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్'. భారత వృద్ధి రేటు 2.5 శాతానికి తగ్గుతుందని లెక్కగట్టింది. ప్రపంచ వృద్ధిలో 0.5 శాతం క్షీణత నమోదవుతుందని అంచనా వేసింది.

moodys
క్షీణించనున్న భారత వృద్ధిరేటు

By

Published : Mar 27, 2020, 11:48 AM IST

2020లో భారత జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతానికే పరిమితం అవుతుందని అంచనా వేసింది ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ 'మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్'. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని.. ఈ మేరకు భారత వృద్ధి కూడా తగ్గిపోనుందని విశ్లేషించింది.

కరోనా ప్రభావానికి ముందు భారత వృద్ధిరేటు 5.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది మూడీస్. కరోనా విజృంభణ కారణంగా తన అంచనాలను సవరించింది. అయితే భారత కేంద్రీయ బ్యాంక్ ఆర్బీఐ ఈరోజు ప్రకటించిన కీలక రేట్లలో కోతను పరిగణనలోకి తీసుకోలేదు మూడీస్.

"బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాల్లో ద్రవ్య పరిమితుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలోకి రుణ ప్రవాహం ఇప్పటికే తగ్గింది. ఈ నేపథ్యంలో 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను తగ్గించాం. దీనిని అభివృద్ధి చెందిన దేశాల వృద్ధిలో అమలు చేశాం. అయితే ఆయా దేశాలు అమలు చేయబోయే ఆర్థిక విధానాల ఆధారంగా వృద్ధి నమోదవుతుంది."

-మూడీస్ ప్రకటన

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో మూడువారాల పాటు లాక్​డౌన్ విధించారు. ఈ కారణంగా వ్యాపారాలు, పరిశ్రమలు నిలిచిపోయాయి. వేలమంది తాత్కాలిక నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. ఈ నేపథ్యంలో మూడీస్ వృద్ధిరేటును సవరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రపంచ వృద్ధీ క్షీణతేే..

కరోనా వ్యాప్తితో ప్రపంచ వృద్ధి 0.5 శాతం మేర తగ్గనుందని అంచనా వేసింది మూడీస్. అయితే 2021లో 3.2 శాతానికి పెరుగుతుందని అభిప్రాయపడింది. కరోనా వైరస్ బయటపడకముందు గత నవంబర్​లో ప్రపంచ వృద్ధిరేటు 2.6 శాతంగా ఉంది.

ఇదీ చూడండి:రుణగ్రహీతలకు ఊరట- ఈఎంఐలపై 3 నెలల మారటోరియం

ABOUT THE AUTHOR

...view details