గత కొద్ది రోజులుగా బంగారం ధరలు చుక్కల నంటుతున్నాయి. ఫలితంగా పసిడికి డిమాండ్ తగ్గి ఆభరణాల పరిశ్రమలో చేతివృత్తిని నమ్ముకున్న వారి జీవితాలు అగమ్యగోచరంగా మారింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని 'ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్' (జీజేసీ) తెలిపింది. మాంద్యం ప్రభావం ఆభరణాల పరిశ్రమపై తీవ్రంగా ఉందని పేర్కొంది.
ఈ ఏడాది బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచింది కేంద్రం. కస్టమ్స్ సుంకం పెంపు, జీఎస్టీ కారణంగా పసిడి ధరలు పెరిగి.. కొనుగోళ్లు తగ్గాయి.
సుంకాలు, జీఎస్టీ తగ్గించాలి