తెలంగాణ

telangana

ETV Bharat / business

'వృద్ధి జోరును బలోపేతం చేయాలి'

ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పుంజుకుంటూ మునుపటి స్థాయికి చేరుకోవాలంటే వృద్ధి ఉరవడిని బలోపేతం చేయాలని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ద్రవ్య, పరపతి విధాన కమిటీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాలను ఆర్​బీఐ సోమవారం విడుదల చేసింది.

By

Published : Feb 23, 2021, 5:03 AM IST

Updated : Feb 23, 2021, 5:22 AM IST

Growth momentum needs to be strengthened: Das
'వృద్ధి జోరును బలోపేతం చేయాలి'

ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం నిలకడగా సాగి, కరోనా ముందు నాటి పరిస్థితికి చేరుకోవాలంటే వృద్ధి జోరును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ నెల 5న జరిగిన ద్రవ్య, పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వివరాలను ఆర్​బీఐ సోమవారం విడుదల చేసింది.

"వృద్ధి రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.. పుంజుకుంటోంది. వేగాన్ని కూడబెట్టుకుంటోంది. కొవిడ్ టీకా రాకతో అంచనాలు బాగా మెరుగయ్యాయి. అయితే ఈ వృద్ధి జోరును మరింత బలోపేతం చేయాలి." అని దాస్ అన్నారు. ద్రవ్యోల్బణ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని పరపతి విధానంలో సర్దుబాటు ధోరణి కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:'కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నివేదిక'

Last Updated : Feb 23, 2021, 5:22 AM IST

ABOUT THE AUTHOR

...view details