తెలంగాణ

telangana

ETV Bharat / business

'భారీ పెట్టుబడులతో రైతులకు రెట్టింపు శక్తి'

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న సంకల్పానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు కేంద్ర ఆర్థిక మంత్రి. అందుకోసం అనుసరించే ప్రణాళికను బడ్జెట్​లో ఆవిష్కరించారు. 'సులభతర జీవనం, సరళమైన వ్యాపారం' సూత్రాన్ని అన్నదాతలకూ వర్తింపచేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు నిర్మలా సీతారామన్.

By

Published : Jul 5, 2019, 5:48 PM IST

'భారీ పెట్టుబడులతో రైతులకు రెట్టింపు శక్తి'

'భారీ పెట్టుబడులతో రైతులకు రెట్టింపు శక్తి'

'గ్రామాలు, పేదలు,అన్నదాత'ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఏ పనైనా చేస్తుందని 2019 బడ్జెట్​లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. 2022 కల్లా అన్నదాతల ఆదాయం రెండింతలు చేసే ప్రక్రియలో భాగంగా వ్యవసాయం, సంబంధిత రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు.

"వ్యవసాయంలోని మౌలిక వసతులపై ఎక్కువ పెట్టుబడులు పెడతాం. రైతుల ఉత్పత్తుల విలువలను పెంచేందుకు ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు సహాయం చేస్తాం. వెదురు, కలప సహా పునరుత్పాదక శక్తి ఉత్పత్తి పెంచేలా కృషి చేస్తాం. అన్నదాత ఎందుకు 'శక్తి'దాత కాలేడు?"
--- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థికమంత్రి.

కొత్తగా 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసి కర్షకులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు నిర్మల. ఆ సంస్థలు రానున్న ఐదేళ్లలో అన్నదాతలకు ఎంతో ఉపయోగపడతాయని ధీమా వ్యక్తం చేశారు.

"సరళమైన వ్యాపారం, సులభతర జీవనం రైతులకూ అందాలి. ఒక సారి మన మూలాలను గుర్తు తెచ్చుకోవాలి. 'సున్నా బడ్జెట్​.' ఇదేమీ కొత్త విషయం కాదు. ఈ వినూత్న పద్ధతిని మనం వ్యవసాయంలో ప్రతిబింబించేలా చేయాలి. సున్నా బడ్జెట్​ వంటి అంశాలతో 75వ స్వాతంత్ర్య దినోత్సవానికల్లా రైతుల ఆదాయం రెట్టింపవుతుంది."
--- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థికమంత్రి.

ప్రభుత్వం ప్రతిపాదించిన 'ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన'(పీఎమ్​ఎమ్​ఎస్​వై) ఆక్వా రంగానికి ఎంతో ఉపయోగపడుతుందని ఉద్ఘాటించారు నిర్మల.

ఇదీ చూడండి:- 'చాహల్ టీవీ'లో విరాట్ చిలిపి పని ​

ABOUT THE AUTHOR

...view details