వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రెండో వార్షికోత్సవాన్ని జూలై 1న నిర్వహించనుంది కేంద్రం. నూతన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. దిల్లీలోని అంబేడ్కర్ భవన్ ఈ వేడుకలకు ముస్తాబవుతోంది. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు.
రెండేళ్ల జీఎస్టీ పనితీరుపై ఈ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ఆధికారులు. పరోక్ష పన్నుల విధానంపై ఆర్థికమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.