తెలంగాణ

telangana

ETV Bharat / business

జూలై 1న జీఎస్టీ రెండో వార్షికోత్సవ వేడుకలు

జీఎస్టీ అమల్లోకి వచ్చి జూలై 1నాటికి రెండేళ్లు నిండనున్నాయి. ఈ సందర్భంగా జీఎస్టీ రెండో వార్షికోత్సవాన్ని దిల్లీలోని అంబేడ్కర్ భవన్​లో ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

By

Published : Jun 29, 2019, 5:11 AM IST

జీఎస్టీ రెండో వార్షికోత్సవ వేడుకలు

జూలై 1న జీఎస్టీ రెండో వార్షికోత్సవ వేడుకలు

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రెండో వార్షికోత్సవాన్ని జూలై 1న నిర్వహించనుంది కేంద్రం. నూతన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, సహాయ మంత్రి అనురాగ్​సింగ్ ఠాకూర్​ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. దిల్లీలోని అంబేడ్కర్​ భవన్​ ఈ వేడుకలకు ముస్తాబవుతోంది. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు.

రెండేళ్ల జీఎస్టీ పనితీరుపై ఈ కార్యక్రమంలో పవర్​ పాయింట్​ ప్రెజెంటేషన్​ ఇవ్వనున్నారు ఆధికారులు. పరోక్ష పన్నుల విధానంపై ఆర్థికమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

వీటితో పాటు జీఎస్టీఆర్-3బీ, జీఎస్​టీఆర్​-1 రిటర్ను వ్యవస్థల స్థానంలో కొత్తగా తీసుకురానున్న విధానాలను ప్రయోగాత్మకంగా ఆవిష్కరించనున్నారు.

ఇదీ చూడండి: 'డీప్​ఫేక్'​ వీడియోలకు చెక్​ పెట్టే దిశగా ఫేస్​బుక్​

ABOUT THE AUTHOR

...view details