బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంకురాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఏంజెల్ పన్ను సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అధికారుల వేధింపులుండవు...
పెట్టుబడిదారులు, అంకురాలు డిక్లరేషన్ ఇచ్చి, రిటర్నులలో పొందుపరిస్తే.. షేర్ల ప్రీమియం విలువపై ఎలాంటి తనిఖీ ఉండదని ప్రకటించారు. పెట్టుబడిదారుల గుర్తింపు కోసం, వారి నుంచి వచ్చే నిధులు మూలాల కోసం ఈ-వెరిఫికేషన్ వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. ఈ విధానంలో ఆదాయ పన్ను అధికారుల నుంచి తనిఖీలు పేరుతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు ఆర్థికమంత్రి.
పెండింగ్లో ఉన్న అంకురాల అసెస్మెంట్, ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు నిర్మల. ఉన్నతాధికారి అనుమతి లేకుండా అసెసింగ్ అధికారి విచారణ, వెరిఫికేషన్ ఉండదని తెలిపారు.
ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్కు ఊతం...
ప్రస్తుతం క్యాటగిరీ-1 ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లలో ఉన్న వారితో పాటు మరికొందరికి ఇచ్చిన అంకుర షేర్లకు ఫేర్ మార్కెట్ విలువను సరిచూడాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపును క్యాటగిరీ-2కు కూడా వర్తింపచేసింది కేంద్రం.