తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాపై కేంద్రం ఉద్దీపనల పోరు - Covid-19 pandemic in india

కరోనాపై పోరాటానికి ఆర్థిక విధానంలో మార్పులు చేసింది కేంద్రం. త్వరలో ఆర్థిక ప్యాకేజీ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రకటనలోని కీలక అంశాలు.

corona
కరోనాపై కేంద్రం ఉద్దీపనల పోరు

By

Published : Mar 24, 2020, 4:09 PM IST

Updated : Mar 24, 2020, 4:37 PM IST

కరోనా వైరస్​పై పోరుకు ఆర్థిక రంగంలో కీలకమార్పులు ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు వైరస్​పై సమర్థంగా పోరాడేందుకు త్వరలో ఆర్థిక ప్యాకేజీ తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటనలోని కీలక అంశాలు.

  • కరోనా సంక్షోభంపై అతి త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తాం.
  • 2019 ఆదాయపన్నుల రిటర్నులు దాఖలు చేసేందుకు ఆఖరు తేది జూన్ 30 వరకు పెంపు.
  • రిటర్నుల దాఖలు ఆలస్యమైతే చెల్లించాల్సిన వడ్డీ 12 నుంచి 9 శాతానికి తగ్గింపు.
  • ఆధార్-పాన్ లింక్ చేయడానికి, వివాద్ సే విశ్వాస్ పథకం తుది గడువు జూన్ 30.
  • మార్చి, ఏప్రిల్, మే మాసాల జీఎస్​టీ దాఖలు చివరి తేది జూన్ 30.
  • రూ. 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలపై జీఎస్టీ రిటర్నుల దాఖలు ఆలస్యమైతే వడ్డీ, పెనాల్టీ, ఆలస్య రుసుములు రద్దు.
  • రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థల జీఎస్టీ రిటర్నుల చెల్లింపు ఆలస్యమైతే పెనాల్టీ విధింపు, వడ్డీ రేటు 9 శాతం వర్తింపు.
  • కంపెనీల బోర్డు సమావేశాలు రెండు నెలల పాటు వాయిదా.
  • చిన్న, మధ్యతరహా వ్యాపారసంస్థల దివాలాను నియంత్రించేందుకు రుణపరిమితిని రూ. లక్ష నుంచి రూ. కోటికి పెంపు.
  • ఏప్రిల్​ తర్వాత సంక్షోభం కొనసాగితే ఆరు నెలలపాటు రుణ ఎగవేత సెక్షన్ల రద్దు.
  • 3 నెలల వరకు ఏ బ్యాంకు ఏటీఎం సేవల్ని వినియోగించుకున్నా ఎలాంటి రుసుములు ఉండవు.
  • సేవింగ్స్ ఖాతాల్లో కనీస మొత్తం ఉంచాలన్న నిబంధనలు తొలగింపు.
Last Updated : Mar 24, 2020, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details