తెలంగాణ

telangana

ETV Bharat / business

జీఎస్​టీ, ఐటీ రిటర్నులకు గడువు పెంపు

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్​టీ రిటర్ను దాఖలు చేసుకునేందుకు మరో అవకాశం ఉంది. తాజాగా గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం సెప్టెంబర్ 30గా ఉన్న ఆఖరు తేదీని.. అక్టోబర్ 31కి పెంచింది. 2019-20 మదింపు సంవత్సర ఐటీ రిటర్ను దాఖలుకూ మరో రెండు నెలలు (నవంబర్ 30 వరకు) గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు.

By

Published : Sep 30, 2020, 7:09 PM IST

CBDT EXTENDED ITR FILING DATE
జీఎస్​టీ రిటర్నుకు పెరిగిన గడువు

2018-19 ఆర్థిక సంవత్సరానికి జీఎస్​టీ వార్షిక రిటర్ను, ఆడిట్ నివేదిక దాఖలు చేసేందుకు గడువు పొడిగించింది ప్రభుత్వం.

"ఎన్నికల నియమావళి నేపథ్యంలో ఎన్నికల కమిషన్​ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే గడువు తేదీలను నిర్ణయించింది ప్రభుత్వం. జీఎస్​టీఆర్​-9, జీఎస్​టీఆర్​-9(సీ).. వార్షిక రిటర్నులను సమర్పించేందుకు సెప్టెంబర్ 30గా ఉన్న చివరి తేదీని అక్టోబర్ 31కి పొడిగించాం."

-కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ)

కరోనా నేపథ్యంలో మే నెలలో.. 2018-19 జీఎస్​టీ రిటర్ను దాఖలు చేసేందుకు మూడు నెలలు (సెప్టెంబర్ 30 వరకు) గడువు పొడిగించడం గమనార్హం.

ఐటీఆర్​కు పెరిగిన గడువు..

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్ను సమర్పించేందుకు.. మరో రెండు నెలలు గడువు పొడిగిచింది ఆదాయపు పన్ను విభాగం(ఐటీ). సెప్టెంబర్ 30 వరకు ఆదాయపు పన్ను రిటర్ను సమర్పించేందుకు వీలు కల్పిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019-20 మదింపు సంవత్సరానికి.. ఆలస్య రిటర్ను, సవరణలతో కూడిన రిటర్ను దాఖలుకు గడువును పెంచింది. నవంబర్ 30 వరకు ఈ అవకాశం ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పేర్కొంది. కరోనా కారణంగా ఐటీఆర్ దాఖలుకు గడువు పొడగించడం ఇది నాలుగోసారి.

ఇదీ చూడండి:మీడియా, వినోద రంగానికి 2021-22లో కొత్త కళ!

ABOUT THE AUTHOR

...view details