తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ఉన్నా బంగారం దిగుమతులు భళా - భారత వాణిజ్య లోటు గణాంకాలు

కరోనా సంక్షోభమున్నా భారత పసిడి దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో రూ.51,400 కోట్లకుపైగా విలువైన బంగారం దిగుమతి చేసుకున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. దీనితో వాణిజ్య లోటు 21.38 బిలియన్​ డాలర్లకు చేరినట్లు వివరించింది.

Gold imports rise in April
పసిడి దిగుమతుల్లో భారీ వృద్ధి

By

Published : Jun 27, 2021, 3:11 PM IST

ఈ ఏడాది ఏప్రిల్​-మే మధ్య బంగారం దిగుమతులు భారీగా పుంజుకున్నాయి. రెండు నెలల్లో దాదాపు రూ.51,438.82 కోట్లు విలువైన పసిడిని భారత్ దిగుమతి చేసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ద్వారా తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో బంగారం దిగుమతుల విలువ కేవలం రూ.599 కోట్లుగా ఉండటం గమనార్హం.

వెండి దిగుమతులు మాత్రం 2021 ఏప్రిల్-మే నెలల్లో రికార్డు స్థాయిలో 93.7 శాతం క్షీణించి.. 27.56 మిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వాణిజ్య శాఖ పేర్కొంది. పసిడి దిగుమతులు పెరగటం వల్ల వెండి డిమాండ్​ పడిపోయినట్లు వివరించింది.

పసిడి దిగుమతులు పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్​-మే నెలల్లో భారత వాణిజ్యలోటు 21.38 బిలియన్​ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది వాణిజ్య శాఖ. గత ఏడాది ఇదే సమయంలో వాణిజ్య లోటు 9.91 బిలియన్ డాలర్లు మాత్రమేనని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా బంగారం దిగుమతుల్లో మన దేశం​ అగ్రస్థానంలో ఉంది. ఏటా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది భారత్​.

ఏప్రిల్​-మే నెలల్లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 6.34 బిలియన్​ డాలర్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ విలువ 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి:అదనపు డీఏ చెల్లింపులపై ప్రభుత్వం క్లారిటీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details