ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ద్రవ్యలోటు అంచనాను పెంచుతూ నివేదిక విడుదల చేసింది ఫిచ్ సొల్యూషన్స్. 2019-20 స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 3.6 శాతం ద్రవ్యలోటు ఉంటుందని పేర్కొంది. ఇంతకు ముందు వేసిన అంచనాల్లో ద్రవ్యలోటు 3.4 శాతంగా ఉంటుందని ఫిచ్ సొల్యూషన్స్ అభిప్రాయపడింది.
ఆర్థిక మందగమనం భయాలు, కార్పొరేట్ సుంకం తగ్గించడం వంటి నిర్ణయాలతో ప్రభుత్వ రాబడి తగ్గడం... ద్రవ్యలోటు అంచనాలు పెంచేందుకు ప్రధాన కారణమని ఫిచ్ పేర్కొంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 3.3 శాతం ద్రవ్యలోటుకు విరుద్ధంగా ఫిచ్ సొల్యూషన్స్ అంచనాలు ఉండటం గమనార్హం.
ద్రవ్యలోటు అంచనాలు తగ్గించడానికి కారణాలు..