తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2020, 6:48 PM IST

ETV Bharat / business

'కరోనా కాలంలోనూ ఎఫ్​డీఐల జోరు'

కరోనా సమయంలోనూ భారత్​కు విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు (ఎఫ్​డీఐలు) పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య మొత్తం ఎఫ్​డీఐలు 13 శాతం పెరిగినట్లు తెలిపారు.

FDIs Growing to India
భారత్​కు పెరిగిన ఎఫ్​డీఐలు

భారత్​కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్​డీఐ) వెల్లువ కొనసాగుతున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దేశంలో అత్యంత సౌకర్యవంతమైన విధానాలు ఉన్నందున ఈ స్థాయిలో ఎఫ్​డీఐలు వస్తున్నట్లు పేర్కొన్నారు. 'సీఐఐ భాగస్వామ్య సదస్సు 2020'లో పాల్గొన్న గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కరోనా సంక్షోభం తీవ్రంగా ఉన్నా.. ఈ ఏడాది తొలి 9 నెలల్లో ఎఫ్​డీఐలను భారీగాఆకర్షించినట్లు తెలిపారు గోయల్. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఎఫ్​​డీఐలు 13శాతం పెరిగి.. 40 బిలియన్​ డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు.

దాదాపు అన్ని రంగాలకు ఆటోమెటిక్ విధానం ద్వారా 100 శాతం ఎఫ్​డీఐలకు అనుమతినిస్తున్నట్లు వివరించారు గోయల్.

అనుమతి తప్పనిసరి..

టెలికాం, మీడియా, ఫార్మా, బీమా రంగాల్లో ఎఫ్​డీఐలకు మాత్రం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. లాటరీ, జూదం, బెట్టింగ్, చిట్​ ఫండ్, రియల్​ ఎస్టేట్, సిగరెట్లు, బీడీల తయారీ సహా మొత్తం తొమ్మిది రంగాల్లో ఎఫ్​డీఐలు నిషేధం.

ఇదీ చూడండి:'రెండు దశాబ్దాల్లో.. టాప్‌-3 ఆర్థికవ్యవస్థల్లో భారత్‌'

ABOUT THE AUTHOR

...view details