ఆదాయ పన్ను సంస్కరణల్లో భాగంగా కేంద్రం మరో ముందడుగు వేసింది. ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లకుండానే పన్ను మదింపు చేసుకునే వీలును కల్పిస్తూ 'ఈ-అసెస్మెంట్' కేంద్రాన్ని ప్రారంభించింది. ఇకపై ఆన్లైన్లో ఇంట్లో నుంచే పన్ను మదింపు చేయించుకునే వీలుకలుగనుంది.
రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్పాండే దిల్లీలోని జాతీయ ఈ-అసెస్మెంట్ కేంద్రాన్ని ఆవిష్కరించారు. ఈ సంస్కరణతో పన్ను చెల్లింపుదారులకు మదింపు ప్రక్రియ మరింత సులభతరంగా, సౌకర్యవంతంగా మారుతుందని ఆయన అన్నారు. పన్ను మదింపు ప్రక్రియలోనూ పారదర్శక పెరుగుతుందని తెలిపారు.
నిజానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ-అసెస్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉంది. ప్రధానితో భేటీకావడం వల్ల ఆమె ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.
దిల్లీలో ఉన్న ఈ-అసెస్మెంట్ ప్రధాన కేంద్రానికి ఆదాయ పన్ను శాఖ ప్రధాన కమిషనర్ అధిపతిగా వ్యవహరించనున్నారు.
దిల్లీతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్కతా, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్లలో ప్రాంతీయ కార్యాలయాలు ఉండనున్నాయి. వీటన్నింటిల్లో సమీక్ష, సాంకేతిక, నిర్ధారణ యూనిట్లు ఉండనున్నాయని ఐటీశాఖ తెలిపింది. వీటికి ఆదాయపన్ను కమిషనర్లు అధిపతులుగా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. ఈ అసెస్మెంట్ కోసం మొత్తం 2,686 ఆదాయపన్ను శాఖ అధికారులను కేటాయించినట్లు వెల్లడించింది.
ఈ అసెస్మెంట్ వివారాలు ఇలా..