తెలంగాణ

telangana

ETV Bharat / business

లక్ష్యాన్ని చేరుకోని ప్రత్యక్ష పన్నుల వసూళ్లు

2018-19లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ప్రభుత్వ లక్ష్యం కంటే రూ.82వేల కోట్లు తగ్గి రూ.11.18 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్​ పన్నుల వసూలు  తగ్గుదలే దీనికి కారణం.

By

Published : May 7, 2019, 10:09 PM IST

లక్ష్యాన్ని చేరుకోని ప్రత్యక్ష పన్నుల వసూళ్లు

2018-19లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ప్రభుత్వ లక్ష్యం కంటే తగ్గాయి. ప్రభుత్వం 12 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసినప్పటికీ రూ.82వేల కోట్లు తగ్గి రూ.11.18 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్​ పన్నుల వసూళ్ల తక్కువగా ఉండటమే దీనికి కారణం.

ప్రభుత్వ లక్ష్యానికి 18 శాతం తక్కువగా వసూలైనప్పటికీ.. క్రితం ఏడాదితో పోల్చితే ఇది 13.4 శాతం అధికం.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాలు తగ్గిపోయిన ప్రభావం పన్నులపై పడింది. కొన్ని ప్రాంతాల్లో క్రితం సారి కంటే తక్కువ పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు.

మార్చి 23 వరకు కేంద్రం నిర్ణయించుకున్న లక్ష్యంలో 85.1 శాతాన్నే అందుకున్నట్లు సీబీడీటీ సభ్యులు నీనా కుమార్​ ప్రాంతీయ సారథులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కమిటీ ఏర్పాటు..

2019-20లో పన్ను వసూలుకు సంబంధించి మెరుగైన ప్రదర్శనచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ABOUT THE AUTHOR

...view details