2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్-9(సీ) రిటర్నుల దాఖలుకు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉన్న ప్రస్తుత గడువును మరో రెండు నెలలు పెంచి.. డిసెంబర్ 31 వరకు అవకాశం ఇస్తున్నట్లు శనివారం ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో మే నెలలో.. 2018-19 జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు కేంద్రం మూడు నెలలు (సెప్టెంబర్ 30 వరకు) గడువు పొడిగించడం గమనార్హం. అయితే గత నెల ఈ గడువును అక్టోబర్ 31గా నిర్ణయించింది.