తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాతో నగదు వినియోగం తగ్గించిన ప్రజలు! - నగదు చలామణిపై నిపుణుల అభిప్రాయాలు

కరోనా వల్ల దేశవ్యాప్తంగా నగదు వినియోగించే వారి సంఖ్య తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. నిజానికి ప్రజలు ఏటీఎంల నుంచి భారీగా నగదు విత్​డ్రా చేస్తున్నప్పటికీ.. చిన్న మొత్తాల్లో చెల్లింపులకు డిజిటల్ వాలెట్లను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

Corona impact on Cash usage
నగదు లావాదేవీలపై కరోనా ప్రభావం

By

Published : May 16, 2021, 6:15 PM IST

కరోనా మహమ్మారి వల్ల ప్రజల్లో కరెన్సీని వినియోగించే తీరులో మార్పులు వచ్చాయంటున్నారు విశ్లేషకులు. ఈ సమయంలోనూ ఏటీఎంల నుంచి భారీగా నగదు విత్​డ్రా చేస్తున్నప్పటికీ.. డిజిటల్ చెల్లింపులకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతున్నారు.

నగదు విత్​డ్రా ఎందుకు?

కరోనా రెండో దశ వల్ల నిత్యం బయటకు వెళ్లేందుకు భయపడుతున్న ప్రజలు ఓకే సారి పెద్ద మొత్తంలో నగదు విత్​డ్రా చేసి పెట్టుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. దానిని అత్యవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే చిన్న మొత్తాల్లో, రోజువారీ కొనుగోళ్లకు మాత్రం యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.

గతంలో ఏటీఎం నుంచి సగటున రూ.2-3 వేల వరకు నగదు విత్​డ్రా చేసే వారు ఇపుడు రూ.3-4 వేల వరకు విత్​డ్రా చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. రూ.వెయ్యి వరకు లావాదేవీలను డిజిటల్ వాలెట్ల ద్వారా జరుపుతున్నట్లు వెల్లడైంది.

ఐఎంపీఎస్​ ద్వారా ప్రస్తుతం రోజుకు సగటు లావాదేవీ విలువ రూ.9 వేలుగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. గతంలో ఇది రూ.6-7 వేల మధ్య ఉన్నట్లు తెలిపింది.

ఆర్​బీఐ డేటా ప్రకారం.. మే 7 నాటికి రూ.2,939,997 కోట్ల నగదు చలామణిలో ఉంది. మార్చి 26న ఇది 2,858,640 కోట్లుగా ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి:ఎయిర్​టెల్ కొత్త ఆఫర్​- రూ.49 రీఛార్జ్ ఫ్రీ!

ABOUT THE AUTHOR

...view details