తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2021, 10:17 AM IST

ETV Bharat / business

జొమాటో ఐపీఓకు సెబీ అనుమతి- త్వరలోనే మార్కెట్లోకి!

ప్రముఖ ఆన్​లైన్​ ఫుడ్ డెలివరీ సంస్థ​.. జొమాటో ఐపీఓకు సెబీ గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సంస్థ రూ.8,250 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Zomato IPO updates
జొమాటో ఐపీఓ అప్​డేట్స్

జొమాటో పబ్లిక్‌ ఇష్యూకు సెబీ ఆమోదముద్ర వేసింది. ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్​ (ఐపీఓ) ద్వారా రూ.8,250 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా రూ.7,500 కోట్ల విలువైన కొత్త షేర్లను జొమాటో జారీ చేయనుంది.

ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో (ఓఎఫ్‌ఎస్‌) ఇన్ఫోఎడ్జ్‌ రూ.350 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. తొలుత రూ.750 కోట్లను ఓఎఫ్‌ఎస్‌లో విక్రయించాలని ఇన్ఫోఎడ్జ్‌ భావించినప్పటికీ.. ఆ తర్వాత దానిని రూ.350 కోట్లకు పరిమితం చేసుకుంది. ఐపీఓ నిమిత్తం ఏప్రిల్‌లో జొమాటో దరఖాస్తు చేసుకోగా.. జులై 2న అనుమతులు ఇచ్చామని సెబీ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

సెప్టెంబరు ఆఖరు కల్లా ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యే దిశగా జొమాటో ప్రణాళికలు రచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి ఇటీవల తెలిపారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని.. ఇష్యూ సైజు, తేదీ, ధరల శ్రేణి వంటి విషయాలు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

టైగర్‌ గ్లోబల్‌, కోరా సహా మరికొన్ని సంస్థల నుంచి ఫిబ్రవరిలో జొమాటో 250 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1800 కోట్లు) సమీకరించింది. దీంతో ఈ సంస్థ విలువ 5.4 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాల్లో బంగారం, పెట్రోల్ ధరలు ఇలా...

ABOUT THE AUTHOR

...view details