తెలంగాణ

telangana

By

Published : Jun 10, 2020, 9:41 AM IST

Updated : Jun 10, 2020, 9:49 AM IST

ETV Bharat / business

భారత్​లోకి 'ఎంఐ ల్యాప్​టాప్​'.. వచ్చేది అప్పుడే!

ఎంఐ.. మొబైల్​ రంగంలోనే ఓ విప్లవం. ఆ బ్రాండ్​ పేరుతో అత్యాధునిక ఫీచర్లు, అతి తక్కువ ధరలు కలిగిన ఫోన్లను వినియోగదారులకు అందించింది తయారీ సంస్థ షియోమీ. త్వరలో సరికొత్త ల్యాప్​టాప్​లతో భారతీయ మార్కెట్​లోని అడుగు పెట్టనుంది. జూన్​ 11న వర్చువల్ ఈవెంట్​ ద్వారా నోట్​బుక్​ను భారతీయ మార్కెట్​లోకి విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది.

With new features Mi Notebook Launch on June 11  through virtual event
భారీ అంచనాలతో భారత్​లోకి 'ఎంఐ ల్యాప్​టాప్​'

దిగ్గజ మొబైల్ సంస్థలకు పోటీగా అత్యాధునిక ఫీచర్లతో 'ఎంఐ' మొబైల్స్​ను మార్కెట్​లోకి తీసుకొచ్చి... మొబైల్​ రంగంలోనే విప్లవం సృష్టించింది షియోమీ. యాపిల్​, వన్​ప్లస్​ వంటి ఖరీదైన ఫోన్లలో ఉండే ఫీచర్లతో... ఎంఐ మొబైల్స్​ను తయారు చేసి, అతి తక్కువ ధరలకు వినియోగదారులకు అందించింది. అలాంటి సంస్థ తొలిసారి ల్యాప్​టాప్​లతో భారతీయ మార్కెట్​లోకి అడుగుపెడుతోంది. దీంతో ఆ ఉత్పత్తులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎంఐ నోట్​బుక్ పేరుతో ల్యాప్​టాప్​ను.. జూన్​ 11, మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్​ ఈవెంట్​ ద్వారా ప్రదర్శించనున్నారు సంస్థ ప్రతినిధులు. అనంతరం వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే తేదీని ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్​, ట్విట్టర్​, ఫేస్‌బుక్​ సహా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

నోట్​బుక్​తో పాటు..

ఎంఐ నోట్​బుక్​ మోడల్​ ఫొటోను షియోమీ ఇండియా మేనెేజింగ్​ డైరెక్టర్​ మను కుమార్​ జైన్​ విడుదల చేశారు. జూన్​ 11న ఎంఐ నోట్‌బుక్​ మోడల్‌తో పాటు, షియోమీ ఎంఐ నోట్‌బుక్​ 'హారిజోన్​' ఎడిషన్‌ను కూడా తీసుకురానున్నట్లు సమాచారం.

ఫీచర్లు ఇవే!

  • ఇంటెల్​ కోర్​ ఐ7 ప్రాసెసర్​(10వ జనరేషన్​)
  • 12 గంటల బ్యాటరీ సామర్థ్యం
  • 14 అంగుళాల ఫుల్​ హెచ్​డీ స్క్రీన్​​
  • డీటీఎస్​ ఆడియో సపోర్ట్
  • ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్

ఇదీ చూడండి:ఐటీఆర్​-1 ఫారంతో రిటర్నుల దాఖలు ఇలా...

Last Updated : Jun 10, 2020, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details