తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇక 'వాట్సాప్‌' సందేశాలు మాయం!

పరిమిత సమయం తర్వాత  మనం పంపిన, మనకొచ్చిన సందేశాలు వాటంతట అవే కనిపించకుండాపోయే సరికొత్త సౌలభ్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్​. ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో పరీక్షించి చూస్తున్నట్టు సమాచారం.

By

Published : Oct 10, 2019, 9:36 AM IST

ఇక వాట్సప్‌ సందేశాలు మాయం!

వాట్సాప్‌’ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మనం పంపిన, మనకొచ్చిన సందేశాలను పనిగట్టుకుని తొలగించుకోవాల్సిన పని ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే... పరిమిత సమయం దాటిన ఆయా సందేశాలు వాటంతట అవే కనిపించకుండాపోయే సౌలభ్యాన్ని వాట్సాప్‌ అందుబాటులోకి తెస్తోంది.

వినియోగదారులు ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడమే కాకుండా, సమయ పరిమితిని కూడా నిర్దేశించుకోవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో పరీక్షించి చూస్తున్నట్టు సమాచారం.

ఇదీ చూడండి:'చెత్త కేఫ్'​ షురూ- కిలో ప్లాస్టిక్​కు భోజనం, అరకిలోకు టిఫిన్​

ABOUT THE AUTHOR

...view details