తెలంగాణ

telangana

By

Published : Feb 20, 2020, 2:30 PM IST

Updated : Mar 1, 2020, 11:03 PM IST

ETV Bharat / business

టెలికాం శాఖకు మరో రూ.వెయ్యి కోట్లు చెల్లించిన వొడాఫోన్​

ఏజీఆర్ బకాయిలకు సంబంధించి మరో రూ.1,000 కోట్లు చెల్లించింది వొడాఫోన్​ ఐడియా. సుప్రీం కోర్టు ఆగ్రహం, టెలికాం శాఖ ఆదేశాల నేపథ్యంలో తొలి దఫాగా ఈనెల 17నే రూ.2,500 కోట్లను జమచేసింది సంస్థ.

BIZ-VODA IDEA-DUES
వొడాఫోన్​

టెలికాం శాఖకు ఏజీఆర్ రూపంలో బకాయిపడ్డ సొమ్ములో మరో వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించింది వొడాఫోన్​-ఐడియా. టెలికాం శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే రూ.2,500 కోట్లు జమ చేసిన వొడాఫోన్​.. నేడు రూ.1,000 కోట్లు కట్టింది.

కోర్టు తిరస్కరించినా..

అయితే బకాయిలను పాక్షికంగా చెల్లిస్తామని వొడాఫోన్​ అభ్యర్థించగా సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయినప్పటికీ వొడాఫోన్​ రూ.2,500 కోట్లే చెల్లించింది. టెలికాం శాఖకు ఏజీఆర్ బకాయిల రూపంలో రూ.53 వేల కోట్లు వొడాఫోన్​ చెల్లించాల్సి ఉంది.

ఏజీఆర్​ బకాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చర్యలు తీసుకుంటామని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఏజీఆర్ బకాయిలకు సంబంధించి రూ.10వేల కోట్లను ఎయిర్​టెల్​ చెల్లించింది.

Last Updated : Mar 1, 2020, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details