తెలంగాణ

telangana

ఆ సంస్థ సీఈఓకు మూడేళ్ల జీతం 'సున్నా'

వొడాఫోన్​-ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్ టక్కర్​కు మూడేళ్ల పాటు జీతం చెల్లించకూడదని సంస్థ నిర్ణయించింది. అయితే, ప్రయాణాలు, బస, వినోద, ఇతర ఖర్చులను సంస్థే భరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

By

Published : Sep 9, 2020, 11:34 AM IST

Published : Sep 9, 2020, 11:34 AM IST

VODA-IDEA-MD-PAY
వోడాఫోన్​-ఐడియా ఎండీ

వొడాఫోన్​-ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్ టక్కర్ మూడేళ్ల వరకు ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేయాల్సి ఉంటుందని సంస్థ ప్రతిపాదించింది. అయితే, టక్కర్​కు సంబంధించిన ప్రయాణం, బస, వినోద, ఇతర ఖర్చులను భరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. బోర్డు మీటింగ్స్, ఇతర కమిటీల సమావేశాల్లో పాల్గొన్న సమయంలో ఎలాంటి వేతనాలు చెల్లించదు.

ఈనెల 30న కంపెనీ 25వ వార్షిక సాధారణ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో టక్కర్ నియామకంతో సహా ఇతర ప్రతిపాదనలపై వాటాదారుల ఆమోదం కోరనుంది. ఇప్పటికే వాటాదారులకు నోటీసులను జారీ చేసింది.

బాలేశ్ రాజీనామాతో..

మాజీ ఎండీ, సీఈఓ బాలేశ్ శర్మ రాజీనామా నేపథ్యంలో టక్కర్​ను ఎంపిక చేసింది వొడాఫోన్​ ఐడియా. 2019 ఆగస్టు 19 నుంచి టక్కర్​ నియామకం అమల్లోకి వచ్చింది. మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. 2019-20 సమయంలో సీఈఓగా ఉన్న బాలేశ్​.. మొత్తంగా రూ.8.59 కోట్ల జీతంగా పొందారు.

ఆర్థిక ఇబ్బందులు..

ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్​-ఐడియా.. రూ.58,250 కోట్లు ఏజీఆర్​ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.7,854 కోట్లు మాత్రమే చెల్లించింది. కంపెనీ వినియోగదారుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోంది.

వొడాఫోన్- ఐడియా విలీనం సమయంలో 43 కోట్ల మంది వినియోగదారులు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 30.9 కోట్లకు పడిపోయింది.

ఇదీ చూడండి:చందా కొచ్చర్‌ భర్తను అరెస్ట్‌ చేసిన ఈడీ

ABOUT THE AUTHOR

...view details