బల్క్ ఎస్ఎంఎస్లకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి నూతన నియంత్రణ నిబంధనలు అమలు చేయనుంది టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్). ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల అమలు.. సజావుగా సాగేలా చూడాలని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వేతర సంఘాలకు, నోడల్ ఏజెన్సీలకు లేఖ రాసింది.
వాణిజ్య సందేశాల కోసం తెస్తున్న కొత్త నిబంధనలకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీల మధ్య సమన్వయం కుదుర్చుకుంటూ.. ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్ఐసీ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎన్ఐసీ.. పరిపాలనా విధానాలకు సాంకేతికతను అందిస్తుంటుంది.
సీఐఐ, ఫిక్కీ, నాస్కామ్, సెల్యులార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) వంటి సంఘాలు తమ సభ్యులకు కొత్త నిబంధనల గురించి వివరించాలని ట్రాయ్ కోరింది.