టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్పీ) కొత్త నిబంధనలు సాంకేతిక అంశాల కారణంగా ఆలస్యం కానున్నాయి. నూతన నిబంధనలను నవంబర్ 11 నుంచి అమల్లోకి తీసుకురానున్నామని తొలుత ప్రకటించింది ట్రాయ్. సాంకేతికంగా తలెత్తిన సమస్యలతో ఈ ప్రక్రియ అమలుకు ఆలస్యం కానుందని సవరణ ప్రకటన చేసింది. అయితే.. ఈ ప్రక్రియ అమలు తేదీని ప్రకటించలేదు. అప్పటి వరకు పాత విధానమే కొనసాగుతుందని తెలిపింది.
సులభంగా మారేందుకు..
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్పీ)కి సంబంధించిన నిబంధనల గురించి చాలాకాలంగా చర్చ నడుస్తోంది. టెలికాం పరిశ్రమలో వినియోగదారులు ఎక్కువగా డిమాండ్ చేసే సేవల్లో పోర్టబిలిటీ ఒకటి.ప్రస్తుత ఎంఎన్పీ ప్రక్రియ కనెక్టివిటీకి ఆటంకం కలిగిస్తుంది. ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్కు పోర్ట్(మారడానికి) చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్న కొత్త నిబంధనలతో ఇది సులభమవుతుంది.
సమయాన్ని తగ్గించడానికే..