తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2019, 5:31 AM IST

ETV Bharat / business

ఉత్తమ 'డీటీహెచ్'​ ఆపరేటర్​ ఏదో తెలుసా?

కేబుల్ టీవీ, డీటీహెచ్​ ముఖ చిత్రాన్ని పూర్తిగా మారుస్తూ టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' ఇటీవల నూతన నిబంధనలు తీసుకువచ్చింది. ఇలా మారిన పరిస్థితుల్లో ఉత్తమ 'డీటీహెచ్'​ సేవలు అందించే  సంస్థలేంటో తెలుసుకోండి ఇప్పుడే.

ఉత్తమ 'డీటీహెచ్'​ ఆపరేటర్​ ఏదో తెలుసా?

'ట్రాయ్' కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో కేబుల్ టీవీ, డీటీహెచ్​ సర్వీసుల ముఖ చిత్రం పూర్తిగా మారింది. డీటీహెచ్​ల ధరల్లోనూ మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది తమ సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకునే పనిలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ 'డీటీహెచ్' తీసుకోవడం మంచిదని ఆలోచిస్తుంటారు చాలా మంది. ఆ సందేహాలు తీరాలంటే ఈ వార్త చదవాల్సిందే.

టాటా స్కై

గత కొన్నేళ్లుగా ఉత్తమ డీటీహెచ్​ ఆపరేటర్​గా టాటా స్కై కొనసాగుతోంది. 'ట్రాయ్' కొత్త నిబంధనలతో టాటా స్కై సరికొత్త ప్లాన్​లను అందుబాటులోకి తెచ్చింది. లైట్ ప్యాక్, మినీ ప్యాక్ వంటి ఆఫర్లతో వినియోగదార్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. వీటితో పాటు వలస ప్రక్రియనూ సలభతరం చేసింది టాటా స్కై.
ఉత్తమ సేవలు అందించడంలో మెరుగ్గా ఉన్నా... 'ట్రాయ్'​ నిబంధలతో 'మల్టీ టీవీ' సేవల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది టాటా స్కై. ఒక వేళ ఒకటి కన్నా ఎక్కువ టీవీల కోసం టాటా స్కై తీసుకోవాలంటే పునరాలోచించడం మంచిది.
సాధారణ కనెక్షన్ అయితే టాటా స్కై ఉత్తమ సర్వీస్ ప్రొవైడర్ అనే చెప్పాలి. పైగా టాటా స్కై ఇటీవల ఎస్​డీ, హెచ్​డీ సెట్​టాప్ బాక్స్​ల​పై రూ. 400 ధర తగ్గించింది.

డీ2హెచ్​

'ట్రాయ్' కొత్త నిబంధనలు తీసుకువచ్చిన తర్వాత 'డీ2హెచ్' మరో ఉత్తమ సర్వీస్ ప్రొవైడర్​గా పేరుతెచ్చుకుంది. మల్టీ టీవీ సేవల్లో ఈ సంస్థ మంచి ఎకనామిక్​ ప్లాన్​లను అందుబాటులో ఉంచింది. నెట్​వర్క్ కెపాసిటీ ఫీ (ఎన్​సీపీ)ని రూ.50 నుంచి ప్రారంభించింది. వీటికి తోడు తమ​ వినియోగదారుల నుంచి ఉత్తమ రివ్యూలు పొందుతోంది డీ2హెచ్. 'ట్రాయ్' కొత్త నిబంధనల్లో డీటీహెచ్ ఆపరేటర్లు తమ సేవల్లో నాణ్యత కచ్చితంగా పాటించాలని హెచ్చరించడం కూడా ఇందుకు కారణం అని చెప్పాలి.

ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ

టాటా స్కై, డీ2హెచ్​ తరహాలోనే ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ కూడా సరికొత్త సేవలందిస్తూ వినియోగాదారులను ఆకర్షిస్తోంది.
డిజిటల్ టీవీలో ఉన్న ఉత్తమ సదుపాయాల గురించి చెప్పుకుంటే.. ఛానెళ్ల ఎంపిక ప్రక్రియను ప్రస్తావించాలి. సెట్​ టాప్ బాక్స్, మొబైల్ అప్లికేషన్​ల ద్వారా సులభంగా కావాల్సిన ఛానెళ్లను ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది ఎయిర్​టెల్​. వీటితోపాటు వార్షిక, అర్ధ వార్షిక చందాలపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. సెట్​ టాప్ బాక్స్​పై రూ.200 ధర తగ్గించింది.
'ట్రాయ్' కొత్త నిబంధనల తర్వాత ఎయిర్​టెల్​ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదనే చెప్పాలి.

సన్​ డైరెక్ట్​

దక్షిణ భారత్​లో ఎక్కువగా వాడే డీటీహెచ్​లో సన్ ​డైరెక్ట్​ది ప్రథమ స్థానం. 'ట్రాయ్' కొత్త నిబంధనలు తెచ్చినప్పుడు సన్​ డైరెక్ట్​ తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్యాక్​ల విషయంలో. అయితే ఇతర ఆపరేటర్లతో పోలిస్తే సన్​డైరెక్ట్ ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు ప్రకటించడం లేదు.

ఇదీ చూడండి: 'పబ్​జీ లైట్'​ ఆడితే.. జియో రివార్డుల పంట!

ABOUT THE AUTHOR

...view details