ప్రపంచవ్యాప్తంగా 100 మంది ఉత్తమ కార్యనిర్వాహక అధికారుల్లో.. ముగ్గురు భారత సంతతి సీఈఓలకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 100 మంది ఉత్తమ పనితీరు కనబరిచిన సీఈఓల జాబితాను "హార్వర్డ్ వ్యాపార సమీక్ష 2019"లో ప్రకటించారు.
ఆర్థికపరమైన పనితీరు, పని వాతావరణం, సామాజిక, పాలనాపరమైన రేటింగ్ల ఆధారంగా హార్వర్డ్ వ్యాపార సమీక్ష జాబితాను రూపొందిస్తారు.
ముగ్గురు భారతీయులు...
ఉత్తమ సీఈఓల జాబితాలోని టాప్10లో.. భారత సంతతికి చెందిన కార్యనిర్వాహక అధికారులు.. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ 6వ స్థానాన్ని, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 7వ స్థానాన్ని, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 9వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.