తెలంగాణ

telangana

కరోనా కష్ట కాలంలో దేశానికి కార్పొరేట్ 'ఊపిరి'!

By

Published : Apr 16, 2021, 5:12 PM IST

కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ.. దేశంలోని ఆస్పత్రులను మెడికల్​ ఆక్సిజన్​ కొరత వేధిస్తోంది. బాధితుల ప్రాణాలు గాలిలో దీపంలా మారిన నేపథ్యంలో.. సాయం చేసేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ముందుకొచ్చాయి. కరోనా మొదటి వేవ్​లో వెంటిలేటర్లు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్న కార్పొరేట్ సంస్థలు.. సెకండ్​ వేవ్​లో ఆక్సిజన్​ను సరఫరా చేస్తూ అటు రోగులకు, ఇటు ప్రభుత్వానికి భరోసా ఇస్తున్నాయి.

ventilators, now oxygen
అప్పుడు వెంటిలేటర్లు.. ఇప్పుడు 'ఆక్సిజన్'​

కరోనా విజృంభణతో దేశంలో 'హెల్త్​ ఎమర్జెన్సీ' తలపిస్తోంది. కొవిడ్​ చికిత్సలో కీలకమైన ఆక్సిజన్​ అందక రోగులు అవస్థలు పడుతున్నారు. మెడికల్​ ఆక్సిజన్​ కొరతతో అల్లాడిపోతున్న రోగులకు ఆపన్నహస్తం అందించేందుకు.. ఆస్పత్రులకు చేయూతనిచ్చేందుకు.. సర్కారుకు అండగా నిలించేందుకు మరోసారి ముందుకు వచ్చాయి కార్పొరేట్​ సంస్థలు. గతేడాది కరోనా విలయం నేపథ్యంలో వెంటిలేటర్లు అందించిన తరహాలోనే.. ఈ సారి కూడా తమ దాతృత్వాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యాయి.

రిలయన్స్ 'మహా' సాయం..

దేశంలో రోజుకు 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆక్సిజన్​కు డిమాండ్​ భారీగా పెరిగింది. దేశంలో అవసరాలకు తగ్గట్టు ఆక్సిజన్​ నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడం వల్ల అనేక ఆస్పత్రుల్లో రోగులు అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. నిల్వలు ఉన్నంత వరకు రాష్ట్రాలకు కేంద్రం పంపుతున్నా.. అవి ఎటూ సరిపోవడం లేదు. రోజుకు 60వేల చొప్పున కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో పరిస్థితి మరి ఆందోళనరకంగా మారింది.

దేశంలోని దయనీయ పరిస్థితులను చూసిన కొన్ని పబ్లిక్​, ప్రైవేటు సంస్థలు తమ పరిశ్రమల అవసరాలకు వినియోగించే ఆక్సిజన్​ నిల్వలను కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు అందించాలని నిర్ణయించాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు కరోనా తీవ్రంగా ఎక్కువగా ఉన్న మహారాష్ట్రకు ఆక్సిజన్​ను అందిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

"మహారాష్ట్ర, కర్ణాటకలోని జేఎస్​డబ్ల్యూ స్టీల్​ ప్లాంట్లు​, ఛత్తీస్​గఢ్​ భిలాయ్​లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్​ స్టీల్​ ప్లాంట్​లోని అదనపు ఆక్సిజన్​ నిల్వలను ఇప్పటికే మహారాష్ట్రకు సరఫరా చేశాయి. మధ్యప్రదేశ్​ ఆక్సిజన్​ అవసరాలను కూడా భిలాయ్​లోని సెయిల్ ప్లాంట్​ తీర్చుతుంది."

- కేంద్రం ప్రకటన

రిలయన్స్ 100 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​..

కరోనాకు మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్న నేపథ్యంలో ప్రైవేటు రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) రాష్ట్ర సర్కారుకు చేయూత అందించేందుకు ముందుకొచ్చింది.

ఇప్పటికే గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ సరఫరా చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్​నాథ్​ షిందే ట్విట్టర్‌ వేదికగా ధ్రువీకరించారు. బ్లూమ్‌బర్గ్ కూడా ఈ విషయాన్ని రాసుకొచ్చింది. తన పెట్రోలియం కోక్ గ్యాసిఫికేషన్ యూనిట్ల కోసం ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ నిల్వలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వైద్య సేవలకు మళ్లించినట్లు పేర్కొంది.

"ముకేశ్​ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్ సంస్థ రాష్ట్రానికి దాదాపు 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను సరఫరా చేయడానికి ముందుకొచ్చింది."

-ఏక్​నాథ్​ షిందే, మహారాష్ట్ర మంత్రి

ఆ నిర్ణయం తర్వాత.. రంగంలోకి కార్పొరేట్లు..

దేశంలో ఆక్సిజన్​ కోరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే 50వేల మెట్రిక్​ టన్నులు మెడికల్​ ఆక్సిజన్​ను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది.

ఇదే సమయంలో కార్పొరేట్​ సంస్థలు ఆక్సిజన్​ను సరఫరా చేసేందుకు ముందుకు రావడం గమనార్హం.

గతేడాది కూడా ఇలాగే..

ఏడాది క్రితం కరోనా మొదటి వేవ్ వెంటిలేటర్ల కొరత ఏర్పడి.. దేశంలో దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో కూడా పలు కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి వెంటిలేటర్లను అందించాయి. అనేక మంది ప్రాణాలను నిలబెట్టాయి.

ప్రధానంగా మారుతీ సుజుకీ ఇండియా, ఆనంద్​ మహీంద్రాకు చెందిన మహీంద్రా-మహీంద్రా సంస్థలు వెంటిలేటర్లను అందించాయి. అలాగే యూకేకు చెందిన ఎంజీ మోటార్​, కంపెనీ వడోదరకు చెందిన ఏబీ ఇండస్ట్రీస్​ సంయుక్తంగా 1,300 వెంటిలేటర్లు తయారు చేసి వితరణగా అందించాయి.

సామాజిక బాధ్యతగా కార్పొరేట్​ సంస్థలు మెడికల్​​ ఆక్సిజన్ అందించేందుకు ముందుకురావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

- శ్రవణ్ నూనె, ఈటీవీ భారత్​

ఇదీ చూడండి:అత్యవసర నిధి ఏర్పాటు చేసుకున్నారా?

ABOUT THE AUTHOR

...view details