తెలంగాణ

telangana

ETV Bharat / business

మారుతీ దారిలోనే టాటా.. జనవరి నుంచే ధరలు పెంపు - BS6 VEHICLES NEWS

మారుతీ సుజుకి ఇండియా దారిలోనే టాటా మోటర్స్​ తమ కంపెనీ వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. బీఎస్​-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను మార్చే క్రమంలో 2020 జనవరి నుంచి ధరల పెంపు అమలులోకి రానున్నట్లు తెలిపింది.

Tata Motors to hike passenger vehicle prices from January
మారుతీ దారిలోనే టాటా

By

Published : Dec 4, 2019, 12:31 PM IST

కార్ల కొనుగోలుదారులకు మరో సంస్థ షాక్​ ఇచ్చింది. మారుతీ సుజుకి ఇండియా దారిలోనే.. 2020 జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు కార్ల తయారీ సంస్థ టాటా మోటర్స్​ ప్రకటించింది. బీఎస్​-6 ప్రమాణాలకు అనుగుణంగా తమ వాహనాలను మార్చే క్రమంలో సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉన్నందును ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ఈ సంస్థ ​ రూ.4.39 లక్షల నుంచి రూ.16.85 లక్షలు(దిల్లీ ఎక్స్​ షోరూం ధర) శ్రేణిలోని హ్యాచ్​బ్యాక్​ టియాగో నుంచి ఎస్​యూవీ హారియెర్ వాహనాలను విక్రయిస్తోంది.

"బీఎస్​-6 వాహనాలు అందుబాటులోకి వస్తే జనవరి నుంచి ధరలు పెరుగుతాయి. మేము ధరల పెంపు నిర్ణయంపై అన్ని విధాలా చర్చిస్తున్నాం. సాధారణంగా ఏదైనా మార్పు జరిగినప్పుడు వాహనాల రేట్లలో సుమారు రూ.10-15 వేల వరకు పెరుగుదల ఉంటుంది. ఇప్పుడు రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి బీఎస్​-6, మరొకటి వస్తువుల ధరల పెరుగుదల ఒత్తిడి కూడా ఉంది. "

- మయాంక్​ పరీక్​, టాటా మోటర్స్​ అధ్యక్షుడు (ప్రయాణ వాహనాల విభాగం)

ప్రస్తుతం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంస్థ.. రేట్లలో ఎంత మేర పెంపు ఉంటుందనే విషయాన్ని వెల్లడించలేదు.

ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా 2020 జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది మారుతీ సుజుకి ఇండియా.

ఏప్రిల్​ 1 నుంచి..

అన్ని సంస్థలు తమ వాహనాలను బీఎస్​-6 ఉద్గార ప్రమాణాలకు మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. 2020 ఏప్రిల్​ 1 నుంచి బీఎస్​-6 అమలులోకి రానుంది. ప్రస్తుతం తయారైన వాహనాలను విక్రయించేందుకు ఏడాది గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థలు చర్యలు చేపట్టాయి.

జనవరి నుంచి కాదు..

ఇతర కార్ల తయారీ సంస్థలు టయోట, మహీంద్ర&మహీంద్ర, మెర్సిడెస్​ బెంజ్ వంటి సంస్థలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది. అయితే.. హ్యూందాయ్​ మోటర్స్​ ఇండియా, హోండా కార్స్​ ఇండియా మాత్రం తమ కార్ల ధరలను జనవరిలో పెంచే యోచన లేనట్లు ప్రకటించాయి. కానీ.. బీఎస్​-6 వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చే క్రమంలో పెంచుతామని తెలిపాయి.

ఇదీ చూడండి: 'బ్యాంకు బీమా పెంపు ప్రతిపాదన మాతో లేదు'

ABOUT THE AUTHOR

...view details