తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2020, 1:41 PM IST

Updated : Feb 18, 2020, 5:42 AM IST

ETV Bharat / business

టాటాసన్స్- మిస్త్రీ కేసు: ఎన్​సీఎల్​ఏటీ తీర్పుపై సుప్రీం స్టే

టాటా సన్స్​-సైరస్ మిస్త్రీ కేసులో రిజిస్ట్రార్​ ఆఫ్ కంపెనీస్​ (ఆర్ఓసీ) పిటిషన్​పై సుప్రీం కోర్టు సానుకూల నిర్ణయం తీసుకుంది. తీర్పులో మార్పులు చేయడం కుదరదన్న ఎన్​సీఎల్​ఏటీ నిర్ణయంపై సుప్రీం స్టే విధించింది.

TATA
టాటాసన్స్-మిస్త్రీ కేసులో ఎన్​సీఎల్​ఏటీ తీర్పుపై సుప్రీం స్టే

టాటా సన్స్‌- సైరస్‌ మిస్త్రీ వివాదంలో జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్ (ఎన్​సీఎల్​ఏటీ) తీసుకున్న మరో నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఇదీ జరిగింది..

సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ ఛైర్మన్​గా పునర్నియమిస్తూ ఎన్​సీఎల్​ఏటీ గతేడాది తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పులో మార్పులు చేయాలని ఎన్​సీఎల్​ఏటీకి విజ్ఞప్తి చేసింది రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్​ఓసీ). కానీ అందులో మార్పులు చేసేందుకు ఎన్​సీఎల్​ఏటీ నిరాకరించి ఆర్​ఓసీ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ కారణంగా ఎన్​సీఎల్​ఏటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది ఆర్​ఓసి.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​.ఏ.బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ విషయంపై విచారణ జరిపి ఎన్​సీఎల్​ఏటీ నిర్ణయంపై తాజాగా స్టే విధించింది.

సైరస్‌ మిస్త్రీని కార్యనిర్వాహక ఛైర్మన్​గా నియమిస్తూ అప్పీలేట్‌ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత న్యాయస్థానం ఈనెల 10న స్టే విధించింది.

Last Updated : Feb 18, 2020, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details