స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త శిఖరాలను తాకాయి. అమెరికా-చైనాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదరటం సహా అంతర్జాతీయంగా ఇతర సానుకూలతలతో.. విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగటం నేటి లాభాలకు ప్రధాన కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 413 పాయింట్లు పుంజుకుంది.. చివరకు 41,352 (జీవనకాల గరిష్ఠం) వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో తిరిగి 12,165 (జీవనకాల గరిష్ఠం) వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,402 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. 41,005 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,183 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవనకాల గరిష్ఠం).. 12,070 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.