తెలంగాణ

telangana

By

Published : Dec 17, 2019, 8:09 PM IST

Updated : Dec 17, 2019, 9:34 PM IST

ETV Bharat / business

డిసెంబర్​ 2020 వరకు ఐయూసీ ఛార్జీలు!

ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియాలకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​. ఐయూసీ ఛార్జీల ఎత్తివేతను 2021 తర్వాత అమలు చేయనున్నట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది.

IUC
ఐయూసీ

ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ ఛార్జీ(ఐయూసీ)లపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఐయూసీ ఛార్జీలు వచ్చే ఏడాది డిసెంబర్​ వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది​. అప్పుల్లో కూరుకుపోయిన.. ఎయిర్​టెల్​, వొడాఫోన్ఐడియాలకు ఈ నిర్ణయం ఊరటనిచ్చే అంశమని టెలికాం నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న 6 పైసల ఐయూసీ ఛార్జీలే 2020 డిసెంబర్​ వరకు కొనసాగుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. 6 పైసల ఐయూసీ.. 2017 అక్టోబర్​ 1 నుంచి కొనసాగుతోంది. అంతకు ముందు ఇది 14 పైసలుగా ఉండటం గమనార్హం.

తాజా గడువు ముగిసిన తర్వాత 2021 జనవరి 1 నుంచి ఐయూసీ ఛార్జీలు పూర్తిగా రద్దవుతాయని ట్రాయ్​ వెల్లడించింది.

ఏంటీ ఐయూసీ..!

రెండు వేరు వేరు నెట్​వర్క్​ల మధ్య ఫోన్​కాల్స్​ మాట్లాడాలంటే కాల్​ చేసిన నెట్​వర్క్​.. కాల్​ రిసీవ్​ చేసుకున్న నెట్​వర్క్​కు​ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీ(ఐయూసీ) అంటారు.

ఇదీ చూడండి:పీపీఎఫ్​ నిబంధనల్లో కీలక మార్పులు

Last Updated : Dec 17, 2019, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details