స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశలతో మదుపరులు సానుకూలంగా స్పందించారు. దాదాపు అన్ని రంగాలు.. నేడు లాభాలతో ముగిశాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో.. సంస్థ నష్టాలు భారీగా తగ్గినట్లు టాటా మోటార్స్ ఇటీవలే ప్రకటించింది. ఫలితంగా మోటార్స్ షేర్లు దూసుకెళ్లాయి. నేటి మార్కెట్ల లాభాలకు ఇదీ ఓ కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 582 పాయింట్లు బలపడింది. చివరికి 39,832 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 160 పాయింట్లు వృద్ధి చెంది..11,787 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..