తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లను కుదిపేసిన వృద్ధి రేటు కోత - GDP

ఆర్థిక మాంద్యం భయాలతో స్టాక్ మార్కెట్లు నేడు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 434 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 139 పాయింట్లు క్షీణించింది. బ్యాంకింగ్ రంగంలో వెల్లువెత్తిన అమ్మకాలు నేటి నష్టాలకు ప్రధాన కారణం.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Oct 4, 2019, 3:50 PM IST

స్టాక్​ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. జీడీపీ అంచనాలను తగ్గిస్తూ ఆర్బీఐ చేసిన ప్రకటన.. మాంద్యం భయాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 434 పాయింట్లు కోల్పోయింది. చివరకు 37,673 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 139 పాయింట్లు క్షీణించి..11,175 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 38,403 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,633 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,400 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,159 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టీసీఎస్​ 1.03 శాతం, ఇన్ఫోసిస్​ 0.90 శాతం, ఓఎన్​జీసీ 0.82 శాతం, టెక్​ మహీంద్రా 0.74 శాతం, ఎన్​టీపీసీ 0.39 శాతం, హెచ్​సీఎల్​ టెక్​ 0.19 శాతం లాభాలను నమోదు చేశాయి.
కోటక్ బ్యాంకు 3.46 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.17 శాతం, హెచ్​డీఎఫ్​సీబ్యాంకు 2.75 శాతం, టాటా మోటార్స్ 2.37 శాతం నష్టపోయాయి.

ఇదీ చూడండి: ఆర్బీఐ శుభవార్త.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ

ABOUT THE AUTHOR

...view details