తెలంగాణ

telangana

ETV Bharat / business

ద్రవ్యోల్బణం ఎఫెక్ట్​.. మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్​ - స్టాక్ మార్కెట్ల అప్​డేట్​

లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు నేడు జీవనకాల గరిష్టాల నుంచి కాస్త వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించింది. బ్యాంకింగ్ రంగ షేర్లు నేడు అధికంగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

STOCKS
స్టాక్ మార్కెట్లు

By

Published : Jan 15, 2020, 4:22 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. గతేడాది డిసెంబర్​లో రిటైల్​, టోకు ద్రవ్యోల్బణం భారీగా పెరగడం మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఇటీవలి లాభాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు ఇన్వెస్టర్లు. ఫలితంగా జీవనకాల గరిష్టాల నుంచి కాస్త వెనక్కి తగ్గాయి సూచీలు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 80 పాయింట్లు క్షీణించింది. చివరకు 41,873 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 12,343 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,970 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,648 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ నేడు 12,355 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,279 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హీరో మోటోకార్ప్​ 2.58 శాతం, టైటాన్​ 1.31 శాతం, మారుతీ 1.18 శాతం, ఏషియన్​ పెయింట్స్ 1.14 శాతం, ఎం&ఎం 1.03 శాతం, టీసీఎస్​ 0.78 శాతం లాభాలను ఆర్జించాయి.

ఇండస్​ఇండ్​ బ్యాంక్​ 5.44 శాతం, ఇన్ఫోసిస్​ 1.21 శాతం, ఎస్​బీఐ 1.13 శాతం, పవర్​ గ్రిడ్​ 0.61 శాతం, టెక్ మహీంద్రా 0.53 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి:భారత్​లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి: జెఫ్​ బెజోస్​

ABOUT THE AUTHOR

...view details