ఒడుదొడుకుల నడుమ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆరంభంలో లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. మిడ్ సెషన్ తర్వాత కాస్త తేరుకుని.. స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 36 పాయింట్లు బలపడింది. చివరకు 40,165 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 22 పాయింట్లు వృద్ధి చెంది..11,899 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,283 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,014 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,918 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,843 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.