తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీరేట్లపై ఎస్​బీఐ కీలక నిర్ణయం- సామాన్యులకు మేలు!

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ వడ్డీ రేట్ల విధానంలో కీలక సవరణలు చేసింది. రెపో ఆధారంగానే.. వ్యక్తిగత, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ వసూలు చేయనున్నట్లు తెలిపింది. అక్టోబర్​ 1 నుంచి నూతన వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నట్లు పేర్కొంది.

By

Published : Sep 23, 2019, 1:28 PM IST

Updated : Oct 1, 2019, 4:41 PM IST

ఎస్​బీఐ

గృహ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్​ఎంఈ) ఇచ్చే రుణాలను రెపో రేటును అనుసంధానం చేయనున్నట్లు ప్రభుత్వ బ్యాంకింగ్​ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్​బీఐ) ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి.. రెపో రేటు ఆధారిత వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయని వెల్లడించింది.

వ్యక్తిగత, రిటైల్​, ఎంఎస్​ఎంఈలకు ఇచ్చే రుణాలకు రెపో రేటును అనుసంధానం చేయాలని సెప్టెంబర్​ 4న రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్​బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.

ఆర్బీఐ ఏం చెప్పిందంటే..

రెపో రేటు ఆధారంగా రుణాలపై వడ్డీ సవరణ కాకుండా 3 లేదా 6 నెలల ట్రెజరీ బిల్లు ఆధారంగా గానీ, ఫినాన్షియల్ బెంచ్​మార్క్​ ఇండియా ప్రచురించిన ప్రామాణిక రేటుకు అనుగుణంగా గానీ వడ్డీ రేట్లు సవరించేందుకు బ్యాంకులకు అవకాశం ఇచ్చింది ఆర్బీఐ.

తొలుత జులై 1 నుంచే ఈ నిబంధనను అమలు చేయాలని భావించింది ఆర్బీఐ. అయితే కొన్ని సవరణలు చేసి అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ఇటీవల సూచించింది.

ఇదీ చూడండి: రెండు రోజుల్లో రూ.10.50 లక్షల కోట్ల సంపద వృద్ధి!

Last Updated : Oct 1, 2019, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details