తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2019, 6:51 PM IST

Updated : Sep 28, 2019, 12:05 PM IST

ETV Bharat / business

మాకు మీ సాయం వద్దు: కేంద్రంతో ఎస్​బీఐ

కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మూలధన సాయం అవసరం లేదని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా స్పష్టం చేసింది. తమ వద్ద ఈ ఆర్థిక సంవత్సరానికి సరిపడా మూలధనం ఉందని పేర్కొంది.

మాకు మీ సాయం వద్దు: కేంద్రంతో ఎస్​బీఐ

ప్రభుత్వం నుంచి ఎలాంటి మూలధన సాయం కోసం తాము ఎదురుచూడట్లేదని స్పష్టం చేసింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుంచి అదనపు నిధులు అవసరం లేదని పేర్కొంది. తమ వద్ద సరిపడా మూలధనం ఉందని చెప్పారు ఎస్​బీఐ మేనేజింగ్​ డైరెక్టర్​ అర్జిత్​ బసు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల అదనపు మూలధన నిధులను విడుదల చేయనున్నట్లు గత శుక్రవారం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఈ నేపథ్యంలో ఎస్​బీఐ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

టైర్​-1, టైర్​-2 బాండ్లకు ప్రణాళికలను కూడా ప్రకటించేశామన్న బసు.. మూలధనం పెంచుకునేందుకు నాన్​ కోర్​​ ఆస్తుల్ని విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు. ఈ మూలధన సాయం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతర బ్యాంకులకు అందిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Last Updated : Sep 28, 2019, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details