తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​బీఐ యూజర్లకు అలర్ట్- ఆ సేవలకు అంతరాయం - ఆన్​లైన్ ఎస్​బీఐ

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్​బీఐ) యూజర్లకు అలర్ట్. తమ సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడనున్నట్లు ఎస్​బీఐ ప్రకటించింది. ఏ సేవలకు అంతరాయం ఏర్పడనుంది? ఎప్పుడు? అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

SBI customers alert! No online banking services available for these two hours
ఎస్​బీఐ యూజర్లకు అలర్ట్- ఆన్​లైన్ బ్యాంకింగ్​కు అంతరాయం

By

Published : Jun 16, 2021, 3:34 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ వినియోగదారులను అలర్ట్ చేసింది. జూన్​ 17 (గురువారం) మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు తమ సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు గంటల సమయంలో యోనో, యోనో లైట్​ యాప్​లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు తాత్కాలికంగా పని చేయవని వెల్లడించింది. వినియోగదారులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరింది.

మెయింటనెన్స్ పనుల్లో భాగంగా అంతరాయం ఏర్పడనున్నట్లు ఎస్​బీఐ పేర్కొంది. జూన్​ 13 కూడా ఇలాంటి కారణాలతోనే ఆన్​లైన్ సర్వీస్​లు 4 గంటల పాటు నిలిచిపోయాయి. మే 21, 23 తేదీల్లోనూ కొన్ని గంటల పాటు ఎస్​బీఐ సేవలన్నింటికీ అంతరాయం ఏర్పడింది.

ఎస్​బీఐ ఆన్​లైన్​ యూజర్ల లెక్క..

డిసెంబర్​ 31 నాటికి.. ఎస్​బీఐకి 8.5 కోట్ల నెట్ బ్యాంకింగ్ యూజర్లు, 1.9 కోట్ల మొబైల్ బ్యాంకింగ్ యూజర్లు ఉన్నారు. యోనో యాప్​లో 3.45 కోట్ల రిజిస్టర్డ్ యూజర్లు ఉండగా.. అందులో రోజుకు సగటున 90 లక్షల మంది ఒకసారైనా యాప్ వాడుతున్నారు.

ఇదీ చదవండి:ద్రవ్యోల్బణానికి ప్రభుత్వాల ఆజ్యం

ABOUT THE AUTHOR

...view details