ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వినియోగదారులను అలర్ట్ చేసింది. జూన్ 17 (గురువారం) మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు తమ సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు గంటల సమయంలో యోనో, యోనో లైట్ యాప్లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు తాత్కాలికంగా పని చేయవని వెల్లడించింది. వినియోగదారులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరింది.
మెయింటనెన్స్ పనుల్లో భాగంగా అంతరాయం ఏర్పడనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. జూన్ 13 కూడా ఇలాంటి కారణాలతోనే ఆన్లైన్ సర్వీస్లు 4 గంటల పాటు నిలిచిపోయాయి. మే 21, 23 తేదీల్లోనూ కొన్ని గంటల పాటు ఎస్బీఐ సేవలన్నింటికీ అంతరాయం ఏర్పడింది.