తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా 15వ ఏటా టీవీల రారాజుగా శాంసంగ్! - టీవీల విక్రయాలపై కరోనా ప్రభావం

వరుసగా 15వ ఏటా ప్రపంచ టీవీ మార్కెట్​లో శాంసంగ్ అగ్రస్థానంలో నిలిచే అవకాశముందని ఓ నివేదిక అంచనా వేసింది. ఈ కంపెనీ 2020లో మొత్తం 4.9 కోట్ల టీవీలు విక్రయించే వీలుందని పేర్కొంది. కరోనా వల్ల విధించిన లాక్​డౌన్​తో ఎక్కువ మంది ఇంటేకే పరిమితమవ్వడం వల్ల టీవీలకు డిమాండ్ పెరిగినట్లు వివరించింది.

Samsung to lead the TV market this year also
టీవీ మార్కెట్ లీడర్​గా మరోసారి శాంసంగ్

By

Published : Dec 24, 2020, 3:39 PM IST

Updated : Dec 24, 2020, 5:05 PM IST

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్​.. ఈ ఏడాది కూడా ప్రపంచ టీవీ మార్కెట్​లో అగ్రస్థానంలో నిలిచే అవకాశముందని ఓ నివేదిక అంచనా వేసింది. అదే జరిగితే శాంసంగ్ వరల్డ్ టీవీ మార్కెట్ లీడర్​ స్థానాన్ని దక్కించుకోవడం వరుసగా ఇది 15వ సారి అవుతుంది.

మార్కెట్ రీసెర్చ్​ సంస్థ ఓమ్డియా ప్రకారం శాంసంగ్ ఈ ఏడాది మొత్తం 4.9 కోట్ల టీవీలు విక్రయించే వీలుంది. ఇప్పటికే మొదటి మూడు త్రైమాసికాల్లో 3.39 కోట్ల యూనిట్లకుపైగా విక్రయించింది శాసంగ్.

కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఇంట్లోనే ఉండటం వల్ల టీవీలకు డిమాండ్​ పెరిగినట్లు నివేదిక అభిప్రాయపడింది.

గత ఏడాదితో పోలిస్తే శాంసంగ్ టీవీల విక్రయాలు 11.2 శాతం పెరిగే వీలుంది. 2014 తర్వాత ఈ స్థాయిలో విక్రయాలు నమోదవ్వడం కూడా ఇదే ప్రథమం కానుందని ఓమ్డియా వివరించింది. సోచీ వింటర్ ఒలంపిక్స్, బ్రెజిల్ వరల్డ్ కప్​ కారణంగా 2014లో అత్యధికంగా 5.29 కోట్ల టీవీలను విక్రయించ గలిగింది శాంసంగ్.

టీవీల మార్కెట్​పై అంచనాలు..

ఓమ్డియా అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది టీవీల విక్రయాలు 22.38 కోట్లు దాటొచ్చు. గత ఏడాది ఈ సంఖ్య 22.39 కోట్లుగా ఉంది.

టీవీల విక్రయాలు పెరిగినప్పటికీ.. ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 154.67 బిలియన్ డాలర్ల నుంచి 97.79 బిలియన్ డాలర్లకు తగ్గొచ్చని నివేదిక అంచనా వేసింది.

ఇదీ చూడండి:ఎయిర్​టెల్​కు 30.6 లక్షల కొత్త యూజర్లు

Last Updated : Dec 24, 2020, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details