తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​కు శాంసంగ్ మడత ఫోన్- ధరెంతో తెలిస్తే షాక్​!

భారత మార్కెట్లో గెలాక్సీ ఫోల్డ్​ను ఆవిష్కరించింది శాంసంగ్​. భారత వినియోగదారులు అక్టోబర్​ 4 నుంచి మడత ఫోన్​ ప్రీబుకింగ్స్​ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అందరి ఆంచనాలను దాటి గెలాక్సీ ఫోల్డ్​ ధరను నిర్ణయించింది కొరియాకు చెందిన ఈ ఎలక్ట్రానిక్​ దిగ్గజం.

By

Published : Oct 1, 2019, 5:46 PM IST

Updated : Oct 2, 2019, 6:47 PM IST

శాంసంగ్ మడత ఫోన్​

స్మార్ట్​ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శాంసంగ్​ మడత ఫోన్​ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచ మొబైల్​ కాంగ్రెస్​లో ప్రకటించినట్లుగానే.. సరికొత్త ఫీచర్లతో గెలాక్సీ ఫోల్డ్​ను ఆవిష్కరించింది శాంసంగ్​.

12 జీబీ ర్యామ్​.. 512 జీబీ స్టోరేజి సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్​ ఫోన్ ధరను భారత్​లో రూ.1,64,999గా నిర్ణయించింది శాంసంగ్​.
శాంసంగ్ మడతఫోన్ల ప్రీబుకింగ్స్ అక్టోబర్​ 4 నుంచి చేసుకోవచ్చు. అక్టోబర్​ 20 నుంచి షిప్పింగ్​లు ప్రారంభం కానున్నాయి.

గెలాక్సీ ఫోల్డ్​ ఫీచర్లు..

  • మడతబెట్టినప్పుడు 4.6 అంగుళాల డిస్​ప్లే
  • మడత తీస్తే..7.3 అంగుళాల భారీ డిస్​ప్లే
  • ఆక్టాకోర్​ ప్రాసెసర్​
  • 16ఎంపీ+12ఎంపీ+12ఎంపీలతో వెనుకవైపు మూడు కెమెరాలు
  • 10 మెగా పిక్సల్​ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్‌ పై ఆపరేటింగ్‌ సిస్టమ్‌
  • 4380 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

ఇదీ చూడండి: వడ్డీ రేట్లు మరోసారి తగ్గడం ఖాయమా...?

Last Updated : Oct 2, 2019, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details