తెలంగాణ

telangana

ETV Bharat / business

గెలాక్సీ ఫోల్డ్​ ఫోన్​పై బంపర్​ ఆఫర్​ భారత్​కే!

శాంసంగ్​ గెలాక్సీ ఫోల్డబుల్ (మడత) ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి రానుంది. సెప్టెంబర్​లో ఈ ఫోన్​ను విడుదల చేయనుంది శాంసంగ్. అందరికన్నా ముందుగా ఈ ఫోన్​ భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

By

Published : Jul 26, 2019, 5:09 PM IST

శాంసంగ్

సెప్టెంబర్​లో రానున్న గెలాక్సీ మడత ఫోన్

మొబైల్ ప్రేమికులను ఊరిస్తున్న గెలాక్సీ ఫోల్డబుల్ (మడత) ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్. సెప్టెంబర్​ నుంచి ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాంసంగ్ తెలిపింది.

మొదట ఏప్రిల్ 26నే మార్కెట్లోకి ఈ ఫోన్​ను విడుదల చేయాలని శాంసంగ్ భావించింది. అయితే టెస్టింగ్ దశలో డిస్​ప్లేపై భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ కారణంగా విడుదలను వాయిదా వేసింది.

ప్రస్తుతం ఈ మోడల్​కు తుది మెరుగులు దిద్దుతోంది శాంసంగ్. ముఖ్యంగా 'ఇన్ఫినిటీ డిస్​ప్లే' విషయంలో కీలక మార్పులు చేసినట్లు శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఫోన్ మడతపెట్టడంలో సహకరించే కీలు భాగాలకు ఇరువైపులా (పైనా, కింద) అదనపు రక్షణ కవచాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. యూజర్లకు ప్రత్యేక ఫోల్డబుల్ అనుభూతిని ఇచ్చేందుకు మార్పులు చేసినట్లు పేర్కొంది.

ఎంపిక చేసిన మార్కెట్లలో భారత్​, దక్షిణ కొరియా, జపాన్ సహా పలు ఇతర మార్కెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్​లోనే ఈ ఫోన్​ ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు:

  • 16ఎంపీ+12ఎంపీ+12ఎంపీలతో వెనుకవైపు 3 కెమెరాలు
  • 10 ఎంపీల సెల్ఫీ కెమెరా
  • 16జీబీ ర్యామ్/512 జీబీ ఆన్​బోర్డ్ స్టోరేజి
  • క్వాల్కామ్ స్నాప్​డ్రాగన్ 855 ఆక్టా-కోర్ ప్రాసెసర్

ఇతర కీలక ఫీచర్లను సెప్టెంబర్​లో మార్కెట్లోకి విడుదల సందర్భంగా వెల్లడించనుంది శాంసంగ్​.

ఇదీ చూడండి: ఆగస్టు 1న హువావే "వై9 ప్రైమ్ 2019"

ABOUT THE AUTHOR

...view details