తెలంగాణ

telangana

ETV Bharat / business

3నెలల్లో 7.5 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్మిన శాంసంగ్​

వరుసగా ఆరు త్రైమాసికాల్లో క్షీణత తర్వాత శాంసంగ్​ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వృద్ధి చెందాయి. శాంసంగ్ నుంచి వచ్చిన 'గెలాక్సీ ఏ' సీరిస్​ ఫోన్లకు దక్కిన ఆదరణ ఇందుకు ప్రధాన కారణం. జూన్​తో ముగిసిన త్రైమాసికానికి మొత్తం 75 మిలియన్ల స్మార్ట్​ఫోన్లు అమ్మింది శాంసంగ్​.

By

Published : Aug 28, 2019, 12:13 PM IST

Updated : Sep 28, 2019, 2:12 PM IST

శాంసంగ్

2019 రెండో త్రైమాసింకంలో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్​ ప్రపంచ వ్యాప్తంగా 75 మిలియన్ల స్మార్ట్​ఫోన్లు విక్రయించింది. 2018 రెండో త్రైమాసికంతో పోలిస్తే ఇది 1.1 శాతం ఎక్కువ. వరుసగా ఆరు త్రైమాసికాల్లో అమ్మకాల క్షీణత తర్వాత.. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పుంజుకున్నట్లు ప్రముఖ టెక్ రీసర్చ్​ సంస్థ గార్ట్​నర్​ పేర్కొంది. 'గెలాక్సీ ఏ' సీరిస్ మొబైల్​ఫోన్లకు దక్కిన ఆదరణ, మిడ్​ రేంజ్ ఫోన్లపై దృష్టి సారించడం కారణంగా శాంసంగ్​కు అమ్మకాలు పెరిగినట్లు వెల్లడించింది.

శాంసంగ్ అమ్మకాల్లో వృద్ధి సాధించినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్​ ఫోన్ల​ అమ్మకాలు మాత్రం 1.7 శాతం క్షీణించాయి. 2019 జూన్​తో ముగిసిన త్రైమాసికానికి ప్రపంచ వ్యాప్తంగా 368 మిలియన్​ యూనిట్ల స్మార్ట్​ఫోన్లు అమ్ముడయినట్లు గార్ట్​నర్ నివేదిక తెలిపింది. మిడ్​ రేంజ్ ఫోన్లతో పోలిస్తే.. హై-ఎండ్​ స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు భారీగా క్షీణించినట్లు పేర్కొంది.

"అమ్మకాలు పెంచుకునేందుకు స్మార్ట్​ఫోన్​ సంస్థలు సరికొత్త వ్యూహాలను అనుసరించాయి. ఎక్కువ కెమెరాలు, నాచ్​ లేని డిస్​ప్లే, బ్యాటరీ సామర్థ్యం పెంచడం వంటి ప్రీమియం ఫీచర్లను తీసుకువచ్చాయి. ఆయా సంస్థలకు చెందిన హైరేంజ్​ ఫోన్లు మొదలుకుని బడ్జెట్​ ఫోన్ల వరకు ఈ సదుపాయాలను తీసుకువచ్చాయి." -అన్షుల్ గుప్తా, సీనియర్​ పరిశోధకుడు​

ధరలు తగ్గించినా పెరగని ఐఫోన్ విక్రయాలు

ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే.. రెండో త్రైమాసికంలో ఐ ఫోన్​లపై ధరలు తగ్గించినప్పటికీ అమ్మకాలు క్షీణించాయి. 2019 జూన్​తో ముగిసిన త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా 38 మిలియన్​ యూనిట్లు మాత్రమే అమ్మింది యాపిల్​.

దేశాల వారీగా తగ్గిన అమ్మకాలు..

దేశాల వారీగా చూస్తే.. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో చైనాలో అత్యధికంగా 101 మిలియన్ల స్మార్ట్​ ఫోన్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సంఖ్య 0.5 శాతం తక్కువ.

భారత్​లో 35.7 మిలియన్ల స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2018 ఇదే సమయంతో పోలిస్తే ఈ అమ్మకాలు 2.3 శాతం తక్కువ. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్​ఫోన్లకు అప్​గ్రేడ్​ అయ్యే వారి సంఖ్య తగ్గటమే ఇందుకు ప్రధాన కారణం.

రానున్న రోజుల్లోనూ స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు క్షీణించొచ్చని గార్ట్​నర్ నివేదిక అంచనా వేసింది. 2019 ముగిసే నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ స్మార్ట్​ఫోన్లు అమ్ముడయ్యే అవకాశముందని పేర్కొంది.

ఇదీ చూడండి: న్యూ-కామర్స్​తో దీపావళికి రిలయన్స్​ ఆఫర్ల ధమాకా!

Last Updated : Sep 28, 2019, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details