బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి.. ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) వ్యాపారాన్ని విడదీసే ప్రక్రియ పూర్తయింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ఈ కొత్త యూనిట్ కంపెనీ వృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తుందని పేర్కొంది.
ఓ2సీ విభాగం.. రిలయన్స్ రిఫైనరీ, పెట్రో ఆస్తులు, రిటైల్ ఇంధన వ్యాపారాన్ని మాత్రమే కలిగి ఉండనుంది. కేజీ-డి6, జౌళి వంటి వ్యాపారాలు దీని కిందకు రావని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే.. మొదటిసారి ఓ2సీ వ్యాపారాలకు సంబంధించి 2020-21 మూడో త్రైమాసికానికి సమగ్ర ఫలితాలు ప్రకటించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంతకు ముందు పెట్రోకెమికల్ వ్యాపారాల ఫలితాలు వేరుగా నివేదించేంది సంస్థ. ఇంధన రిటైల్ ఆదాయం కంపెనీ మొత్తం రిటైల్ వ్యాపారాల ఆదాయంలో భాగంగా ప్రకటించేది.