తెలంగాణ

telangana

ETV Bharat / business

వేతనాల కోతపై ఉద్యోగులకు రిలయన్స్ గుడ్​ న్యూస్ - రిలయన్స్ ఉద్యోగులకు పండుగ వేళ శుభవార్త

దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు పండుగ నేపథ్యంలో గుడ్​ న్యూస్ చెప్పింది. సంస్థ హెడ్రోకార్బన్ విభాగ ఉద్యోగులకు.. కరోనా నేపథ్యంలో విధించిన వేతనాల కోతను తిరిగి చెల్లించేందుకు సిద్ధమైంది.

Reliance rolls back salary cuts
రిలయన్స్ ఉద్యోగులకు గుడ్​ న్యూస్

By

Published : Oct 26, 2020, 1:02 PM IST

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. హైడ్రోకార్బన్ డివిజిన్ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. కరోనా కారణంగా.. విధించిన వేతనాల కోతలను చెల్లించేందుకు సిద్ధమైంది. పర్ఫార్మెన్స్ బోనస్​ను కూడా ఇవ్వనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

కరోనా కాలంలో పని చేసేందుకు మంచి సంకేతంగా.. వచ్చే ఏడాది వేతనం నుంచి 30 శాతం అడ్వాన్స్​గా రిలయన్స్ ఇవ్వనున్నట్లు.. ఈ విషయంతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు.

వేతనాల కోత ఇలా..

కరోనా నేపథ్యంలో వ్యాపారం దెబ్బతిన్న కారణంగా.. హైడ్రోకార్బన్ విభాగ ఉద్యోగులకు 10 నుంచి 50 శాతం వరకు వేతనాల్లో కోత విధించింది. సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తన పూర్తి వేతనాన్ని వదులుకోవడాని అంగీకారం తెలిపారు. ఇదే సమయం నుంచి వార్షిక బోనస్​లు, పనితీరు ఆధారిత పోత్సాహకాలు ఇవ్వడాన్ని కూడా ఆపేసింది.

ఇదీ చూడండి:ఎల్​టీసీ క్యాష్​ ఓచర్ల​పై ఆర్థిక శాఖ స్పష్టత

ABOUT THE AUTHOR

...view details