ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. హైడ్రోకార్బన్ డివిజిన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా.. విధించిన వేతనాల కోతలను చెల్లించేందుకు సిద్ధమైంది. పర్ఫార్మెన్స్ బోనస్ను కూడా ఇవ్వనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
కరోనా కాలంలో పని చేసేందుకు మంచి సంకేతంగా.. వచ్చే ఏడాది వేతనం నుంచి 30 శాతం అడ్వాన్స్గా రిలయన్స్ ఇవ్వనున్నట్లు.. ఈ విషయంతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు.