తెలంగాణ

telangana

6 పైసల కోసం టెలికాం దిగ్గజాల మధ్య మీమ్స్​ వార్​

By

Published : Oct 14, 2019, 2:23 PM IST

టెలికాం సంస్థల ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ ఛార్జ్​ (ఐయూసీ)తో ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​పై నిమిషానికి 6 పైసలు వసూలు​ చేయనున్నట్లు ప్రకటించింది రిలయన్స్​ జియో. ఈ ప్రకటనతో సామాజిక మాధ్యమాల వేదికగా టెలికాం సంస్థల మధ్య యుద్ధం​ నడుస్తోంది. ఒకరిపై ఒకరు పోస్ట్​లు పెడుతూ ట్రోల్​ చేసుకుంటున్నాయి దిగ్గజ టెలికాం సంస్థలు.

6 పైసల కోసం టెలికాం దిగ్గజాల మధ్య మీమ్స్​ వార్​

ఉచిత కాల్స్​, తక్కువ ధరకే డేటా అందిస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. ఇక నుంచి కాల్​ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. టెలికాం సంస్థల ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ ఛర్జ్​ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు ఛార్జ్​ చేయనున్నట్లు తెలిపింది.

ఐయూసీ ఛార్జీలు విధిస్తున్నట్లు జియో ప్రకటించటాన్ని అదునుగా తీసుకున్న ఇతర నెట్​వర్క్​లు ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా వంటివి సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్​ చేస్తున్నాయి. జియో నుంచి తమ నెట్​వర్క్​లోకి వచ్చేయండంటూ ట్విట్టర్​ వేదికగా పలు పోస్టులు పెట్టాయి.

ఎయిర్​టెల్​ ట్వీట్​
వొడాఫోన్​ ట్వీట్​

ఐయూసీ ఛార్జీలపై ఇతర నెట్​వర్క్​లు చేస్తోన్న రాద్ధాంతానికి దిమ్మదిరిగే షాక్​ ఇచ్చింది రిలయన్స్​ జియో. ట్రాయ్​ నిబంధనల మేరకు ఇతర నెట్​వర్క్​లకు రూ.13,500 కోట్లు చెల్లించాల్సి వచ్చందని పేర్కొంది. నిమిషానికి 6 పైసలు వసూలు చేయాల్సి వస్తోంది ఇతర టెలికాం ఆపరేటర్ల కారణంగానేనని వివరించింది. ఎయిర్​టెల్​ను 'ఎయిర్​ టోల్'​ అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించింది. వొడాఫోన్​-ఐడియాపైనే ఇలాంటి మాటల తూటాలే సంధించింది.

జియో ట్వీట్​

ప్రత్యర్థుల్ని విమర్శించే పోస్టుల్ని ఆయా సంస్థల థీమ్​ కలర్​తోనే రూపొందించింది జియో. దీనిపై ఎయిర్​టెల్​ సరదాగా స్పందించింది. 'మా థీమ్ కలర్​లో నువ్వు చాలా బాగున్నావ్​' అంటూ జియో ట్వీట్​కు రిప్లై ఇచ్చింది.

ఐడియాపై జియో ట్వీట్​

ఇదీ చూడండి:అదానీ గ్యాస్​లో 37.4 శాతం వాటా కొనుగోలు!

ABOUT THE AUTHOR

...view details