తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్ వస్తే 'కిరాణం'లోనూ సంచలనమే! - డిజిటల్​ కిరాణం

మన ఇంటి పక్కన ఉండే కిరాణా దుకాణం తీరే ప్రత్యేకం. అక్కడ కార్యకలాపాలన్నీ పూర్తిగా సంప్రదాయబద్ధం. ఇప్పుడిప్పుడే ఆ దుకాణాలు ఆన్​లైన్​ బాట పడుతున్నాయి. పేటీఎం వంటి వ్యాలెట్లతో చెల్లింపులు జరిపే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మరింత మార్పు రానుంది. కిరాణా దుకాణానికీ ఆన్​లైన్​లో ఆర్డర్​ ఇచ్చే రోజు రానుంది.

రిలయన్స్

By

Published : May 12, 2019, 2:54 PM IST

జియోతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది రిలయ్సన్​ ఇండస్ట్రీస్​. ఆన్​లైన్​ చిల్లర వర్తక రంగంలోనూ ఆ సంస్థ​ అలాంటి అద్భుతాలే సృష్టించే అవకాశముందని అంచనా వేసింది 'బ్యాంక్​ ఆఫ్​ అమెరికా మెరిల్​ లించ్​'.

ప్రస్తుతం దేశంలో 15వేల డిజిటల్​ చిల్లర దుకాణాలు ఉన్నాయి. ఆన్​లైన్​ రిటైల్​ రంగంలోకి రిలయన్స్​ రాకతో ఆ సంఖ్య 2023 నాటికి 50లక్షలకు చేరుతుందని లెక్కగట్టింది బ్యాంక్​ ఆఫ్​ అమెరికా మెరిల్ లించ్. మరికొన్ని ఆసక్తికర అంశాలతో ఓ నివేదిక రూపొందించింది. ఆ వివరాలు...

ఎక్కువ అసంఘటితమే...

భారత్​లో 90 శాతం(దాదాపు 700 బిలియన్​ డాలర్ల) రిటైల్​ మార్కెట్​ అసంఘటితంగా ఉంది. పెరుగుతున్న పోటీ కారణంగా ఈ కిరాణా దుకాణాలు సాంకేతికత దిశగా అడుగులు వేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను అమలు తర్వాత డిజిటలీకరణ మరింత అనివార్యమైంది. జీఎస్టీ బిల్లులు ఆన్​లైన్​లో సృష్టించాల్సి ఉండడం ఇందుకు కారణం.

కిరాణా దుకాణదారుల్లో సాంకేతికత పట్ల మారుతున్న దృక్పథం రిలయన్స్​కు కలిసి వస్తుందని అంచనా వేసింది బ్యాంక్​ ఆఫ్​ అమెరికా మెరిల్​ లించ్​.

భారీ ప్రణాళికతో...

రిలయన్స్​కు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10,000 రిటైల్​ స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్​లైన్​-టూ-ఆఫ్​లైన్ ఈ-కామర్స్​ వేదికను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది.

కిరాణా స్టోర్లలో మొబైల్​ పాయింట్​ ఆఫ్​ సేల్స్​ (ఎంపీఓఎస్​) పరికరాన్ని అమర్చాలని భావిస్తోంది రిలయన్స్​. వేగవంతమైన 4జీ అంతర్జాల సేవల ద్వారా తమ వినియోగదార్ల ఆర్డర్లును అందుకునేందుకు ఈ పరికరం దుకాణదారులకు ఉపయోగపడుతుంది.

జియోనే చౌక...

జియో ఎంపీఓఎస్​ పరికరం కోసం కిరాణా యాజమానులు ఒకసారి రూ.3,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఇదే పరికరం కోసం ప్రస్తుతం స్నాప్​బిజ్​ రూ. 50,000.., నుక్కడ్ షాప్స్ రూ.30,000-రూ.55,000.., గో ఫ్రూగల్ రూ.15,000 నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నాయి.

వీటితో పోల్చుకుంటే తక్కువ ధరకే లభించే జియో ఎంపీఓఎస్​వైపే చిన్న వ్యాపారులు మొగ్గుచూపొచ్చని బ్యాంక్​ ఆఫ్​ అమెరికా మెరిల్​ లించ్​ విశ్లేషించింది.

"రిలయన్స్​ ఆన్​లైన్​ చిల్లర వర్తకంలోకి ప్రవేశిస్తే.. వ్యాపారుల అనుకూలతలు పెరుగుతాయి. ధరలు తగ్గుతాయి."
- మెరిల్​ లించ్​ నివేదిక

ఎంపీఓఎస్​పై సానుకూలం!

ఎంపీఓఎస్​పై ముంబయి, నవీ ముంబయిలోని 15 స్టోర్లలో అభిప్రాయ సేకరణ జరిపారు. వారంతా ఎంపీఓఎస్​పై సానుకూలంగా ఉన్నారని తేలింది.

తక్కువ పెట్టుబడికే లభించే ఈ వ్యవస్థతో కచ్చితమైన లాభాలు వస్తాయని వారు భావిస్తున్నట్లు బ్యాంక్​ ఆఫ్​ అమెరికా మెరిల్​ లించ్ నివేదిక వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details